ఆంధ్రప్రదేశ్‌కిడ్నాప్ చేసినా అఖిలప్రియకు కోట్ల ఆస్తి రాలేదే?

కిడ్నాప్ చేసినా అఖిలప్రియకు కోట్ల ఆస్తి రాలేదే?

Bhuma Akila Priya
హఫీజ్‌పేట కిడ్నాపింగ్‌ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. ఈ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి అఖిలప్రియ ప్రమేయం ఉండడంతో కేసు మరింత ఆసక్తికరంగా మారింది. హఫీజ్‌పేటలోని 50 ఎకరాల భూములకు సంబంధించిన వివాదంలో హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్‌ రావు సోదరులను అఖిలప్రియ అనుచరులు కిడ్నాప్‌ చేయడం సంచలనంగా మారింది. వారితో బలవంతంగా సంతకాలు చేయించే ప్రయత్నాలు సాగించినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. చివరకు ఆ కిడ్నాప్‌ డ్రామా ఫెయిల్‌ కావడంతో వారి ప్లాన్‌ అంతా వృథా అయింది.

చివరకు ఈ వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ వ్యవహారంలో ఆమె భర్త పరార్‌‌ అయ్యారు. ఆమె సోదరుడు కూడా పరార్‌‌ అయ్యారు. కొద్ది రోజుల జైలులో ఉన్న తర్వాత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అంతేకాదు.. ఆమె భర్త భరత్‌ కూడా అరెస్టు కాకముందే ముందస్తు బెయిల్‌కు మంజూరు చేసింది. కేవలం ఆ ఆస్తి కోసమే ఇంత కుట్ర పన్నినా.. చివరకు ఇప్పుడు ఆ ఆస్తులు భూమా ఫ్యామిలీకి దక్కే అవకాశాలు లేనట్లుగా కనిపిస్తోంది.

హఫీజ్‌పేట భూములు తమవేనంటూ భూమా విఖ్యాత్‌ కిడ్నాప్‌ వ్యవహారం తర్వాత ప్రకటించారు. అయితే.. ఆ భూములు వీరివే అయినప్పుడు ఇంత నాటకం ఆడాల్సిన అవసరం లేదు కదా. వారిని బలవంతంగా కిడ్నాప్‌ చేసి సంతకాలు చేయించేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు..? దీనిపై ఇప్పటివరకు ఎవరు కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అది కూడా బలవంతంగా ఎందుకు సంతకాలు పెట్టించుకునే ప్రయత్నం చేశారనేది ఎవరూ స్పష్టం చేయలేదు.

ఆ హఫీజ్‌పేట భూ వివాదం రచ్చకెక్కడంతో ప్రభుత్వం కూడా కోర్టును ఆశ్రయించింది. ఆ భూములన్నీ ప్రభుత్వానివి అంటూ తెలంగాణ గవర్నమెంట్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ.. ఆ భూములు ప్రైవేటు వ్యక్తులవేనని కోర్టు స్పష్టతనిచ్చింది. ప్రవీణ్‌రావు ఫ్యామిలీకి సానుకూలంగానే తీర్పు వచ్చిందట. ఈ క్రమంలో ప్రవీణ్‌ రావు కుటుంబానికి భారీ లబ్ధి చేకూరనుంది. ఈ 50 ఎకరాల భూమి వారికే చెందుతుందని కోర్టు స్పష్టంగా పేర్కొంది. అయితే.. ఇప్పుడు ఏ 50 ఎకరాల భూమి కోసం భూమా ఫ్యామిలీ కిడ్నాప్‌ వ్యవహారం నడిపించిందో చివరకు ఏపాటి లాభం పొందిందో అర్థం కాని పరిస్థితి. ఆ భూములు ప్రవీణ్‌ రావు ఫ్యామిలీకే సొంతం కావడంతో భూమా ఫ్యామిలీకి దక్కింది శూన్యం. ఆ ఏరియాలో ఎక‌రం భూమి దాదాపు 40 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంది. దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ఆ ల్యాండ్‌ రేటు రూ.2 వేల కోట్లు. ఈ ప్రకారం చూస్తే భూమా ఫ్యామిలీ ఈ 2 వేల కోట్ల ఆస్తిని చేజార్చుకుందని లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Mohan Babu : మోహన్ బాబు పై కిడ్నాప్ కేసు నమోదు..సంచలనం రేపుతున్న ఆరోపణలు..అసలు ఏమి జరుగుతోంది!

Mohan Babu : మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), మంచు విష్ణు(Manchu Vishnu) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తిరుపతి లో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ధర్నా చేస్తున్న SFI సంఘం...

MLA Bhuma Akhila Priya: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు అస్వస్థత

MLA Bhuma Akhila Priya దొర్నిపాడు మండలం డబ్ల్యూగోవిందిన్నెలో ఓ జాతరకు వెళ్లిన ఆమె పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version