spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Cabinet Reshuffle: కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా?

AP Cabinet Reshuffle: కొత్త మంత్రివర్గంపై జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారా?

AP Cabinet Reshuffle: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై జగన్ దృష్టి సారించారు. ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. మంత్రుల రాజీనామాలతో ముందుకు వెళ్లనున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో ఎవరు తప్పుకోవాలనే దానిపై స్పష్టత ఇవ్వడంతో మంత్రులు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ తిరిగొచ్చిన వెంటనే ఈనెల 7న మంత్రులతో రాజీనామా చేయించాలని చూస్తున్నారు. తరువాత గవర్నర్ తో సమావేశమై కొత్త మంత్రివర్గంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

AP Cabinet Reshuffle
Y S Jagan

రాజకీయ విషయాలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అవుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన కేంద్రంలో అందరిని కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన సాయంపై చర్చిస్తున్నారు. 8న గవర్నర్ హరిచందన్ భూషణ్ తో ప్రత్యేకంగా జరిగే భేటీలో కొత్త మంత్రివర్గ కూర్పుపై నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Secret Of KCR Delhi Tour: కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్ ఇదే.. ఆ నిర‌స‌న‌కు వెళ్ల‌డం డౌటే..?

ఈనెల 11న కొత్త మంత్రివర్గం కొలువుదీరే విధంగా కార్యాచరణ ఇప్పటికే రూపొందించారు. జిల్లాల పునర్విభజన తరువాత మంత్రివర్గంపైనే దృష్టి సారించారు. దీంతో ఆశావహులు సైతం జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొద్ది రోజులుగా మంత్రివర్గ విస్తరణపై ముమ్మరంగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దానిపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో గెలిచే వారికే పదవులు దక్కేలా నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.

AP Cabinet Reshuffle
JAGAN

పదవుల నుంచి తొలగిపోయే వారు రేపు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. తమ పదవులకు రాజీనామా చేసి అధినేత నిర్ణయాన్ని వారు గౌరవించనున్నారు. తమకు ఏ పదవి ఇచ్చినా సరే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణ ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజకీయంగా కొత్త మంత్రివర్గం బలంగా ఉండేందుకు జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Also Read:RDO Shoking Comments For Kaaleshwaram: మీరు భూమి ఇవ్వ‌క‌పోతే పురుగుల మందు తాగుతా.. ఇదీ తెలంగాణ‌లో ఉద్యోగుల ప‌రిస్థితి..!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper