ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితులు ఇద్దరు మృతి చెందినట్లు కరుణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రకటించింది. అనంతపురానికి చెందిన ఒక వ్యక్తి మక్కా సందర్శన వెళ్లి రావడంతో కరోనా సోకింది. ఈనెల1వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగో తేదీ మరణించాడు. మచిలీపట్నం కు చెందిన మరో వ్యక్తి కి సెక్స్ వ్యాపార నిమిత్తం ఒరిస్సా వెళ్లి రావడంతో కరోనా సోకింది. ఈనెల 2వ తేదీ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 4వ తేదీ రాత్రి మృతి చెందాడని అధికారులు ప్రకటించారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 266 కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం ఆదివారం రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు 14 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 32, నెల్లూరు జిల్లాలో 34, ప్రకాశం జిల్లాలో 23, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 16, విశాఖపట్నం జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 6, కర్నూలు జిల్లాలో 56 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 56 నమోదై కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉంది. నెల్లూరు జిల్లాలో 34 కేసులు నమోదు అయ్యాయి.