డిసెంబర్ నాటికి కరోనా థర్డ్ వేవ్.. క్లారిటీ ఇదే

మాయదారి కరోనా రూపు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. అందరినీ కబళించేందుకు వడివడిగా దూసుకొస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇప్పటికే ప్రజల ప్రాణాలు తీసింది. సెకండ్ వేవ్ దేశంలో మారణ హోమాన్ని సృష్టించింది. ఆ ఉపద్రవం మరిచిపోకముందే ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే నిపుణులు థర్డ్ వేవ్ ఉండొచ్చని సెకండ్ వేవ్ ను మించి అల్లకల్లోలం సృష్టించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇటీవలే భారత దిగ్గజ బ్యాంకు ఎస్.బీ.ఐ కూడా బాంబు పేల్చింది. ఆగస్టు నెలలో […]

Written By: NARESH, Updated On : July 9, 2021 8:55 am
Follow us on

మాయదారి కరోనా రూపు మార్చుకుంటూ విరుచుకుపడుతూనే ఉంది. అందరినీ కబళించేందుకు వడివడిగా దూసుకొస్తోంది. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఇప్పటికే ప్రజల ప్రాణాలు తీసింది. సెకండ్ వేవ్ దేశంలో మారణ హోమాన్ని సృష్టించింది. ఆ ఉపద్రవం మరిచిపోకముందే ఇప్పుడు థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే నిపుణులు థర్డ్ వేవ్ ఉండొచ్చని సెకండ్ వేవ్ ను మించి అల్లకల్లోలం సృష్టించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.

ఇటీవలే భారత దిగ్గజ బ్యాంకు ఎస్.బీ.ఐ కూడా బాంబు పేల్చింది. ఆగస్టు నెలలో కోవిడ్ థర్డ్ వేవ్ ప్రారంభమవుతుందని.. సెప్టెంబరులో గరిష్టస్థాయిని చూపుతుందని ఎస్.బీ.ఐ రీసెర్చ్ పేర్కొంది. ఈ పరిశోధనలో ‘గ్లోబల్ వేవ్ కన్నా దేశంలో సగటు కేసులు గరిష్ట్ర స్తాయికి చేరుకుంటాయని.. 1.7 రెట్లు ఎక్కువగా థర్డ్ వేవ్ లో కేసులు నమోదు అవుతాయని హెచ్చరించింది.

మొన్నటి కరోనా సెకండ్ వేవ్ కల్లోలంలో గరిష్టంగా రోజుకు 4.12 లక్షల కేసులు నమోదయ్యాయి. దానికే జనం పిట్టల్లా రాలిపోయారు. దేశంలో మరణ మృదంగం వినిపించింది. ఇప్పుడు అంతకుమించి కేసులు మూడో వేవ్ లో భారత్ లో నమోదవుతాయని.. ఏకంగా రోజుకు 7 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఎస్.బీ.ఐ పరిశోధనలో బాంబు పేల్చింది. మే 7న సెకండ్ వేవ్ దేశంలో అత్యధిక కేసులు నమోదు చేసిందని.. ఇప్పుడు డేటా ప్రకారం ఆగస్టులో థర్డ్ వేవ్ మొదలవుతుందని ఎస్.బీ.ఐ పేర్కొంది.

ప్రస్తుతం డేటా ప్రకారం.. జులై 2వ వారంలో భారత్ లో 10వేల కేసులకు చేరుతుంది. ఆగస్టు 2వ వారం నాటికి కేసులు పతాక స్తాయికి చేరుకుంటాయని ఎస్.బీఐ నివేదిక తెలిపింది.

అయితే కొంతమంది మాత్రం.. దేశంలో వేస్తున్న టీకా ప్రభావంతో థర్డ్ వేవ్ తీవ్రత తగ్గుతుందని.. వైరస్ పరివర్తనం చెంది కొత్త ప్రాణాంతక వైవిధ్యంగా మారితే తప్ప మూడో వేవ్ అంత పెద్దది కాదని చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా భారత్ జనాభాలో కేవలం 4.8శాతం మందికి మాత్రమే రెండు టీకాలు వేసుకున్నారు. 21.6శాతం మంది జనాభా ఒక డోసు తీసుకున్నారు.

థర్డ్ వేవ్ పై తాజాగా తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి కోవిడ్ మూడోదశ ఉధృతి వచ్చే అవకాశాలు లేవని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఒకవేళ వచ్చినా.. దాని ప్రభావ తీవ్రత తక్కువేనని ఆయన క్లారిటీ ఇచ్చారు. సెకండ్ వేవ్ దేశంలో చాలా తీవ్ర ప్రభావం చూపిందని.. ఆ తర్వాత పుట్టుకొచ్చే కొత్త వైరస్ లు బలహీనంగా ఉంటాయని..వాటి ప్రభావం అంతగా ఉండదని ఆయన విశ్లేషించారు. ప్రజలు మాత్రం కరోనా నిబంధనలు పాటించాలని శ్రీనివాసరావు సూచించారు. మరి థర్డ్ వేవ్ దేశంలో అలుముకుంటుందా? లేదా? అన్నది వేచిచూడాలి.