కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారతీయ రైల్వే

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి గంట గంటకి పెరగటంతో దానిని నియంత్రిచేందుకు వివిధ శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ భారీ స్థాయిలో రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు వారి వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఇండియన్ రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. ప్రధాన రైళ్లకు జనం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 98రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ రేపటి (20వ తేదీ) నుంచి దేశవ్యాప్తంగా […]

Written By: Neelambaram, Updated On : March 19, 2020 2:31 pm
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి గంట గంటకి పెరగటంతో దానిని నియంత్రిచేందుకు వివిధ శాఖలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ భారీ స్థాయిలో రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికులు వారి వారి ప్రయాణాలను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఇండియన్ రైల్వే భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. ప్రధాన రైళ్లకు జనం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇప్పటికే 98రైళ్లను రద్దు చేసిన రైల్వేశాఖ రేపటి (20వ తేదీ) నుంచి దేశవ్యాప్తంగా మొత్తం 168 రైళ్లు రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఈనెల 31వ తేదీ వరకు రద్దు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇందులో వెస్ట్, నార్తర్న్ సెంట్రల్ రైల్వేలో 11 రైళ్లు, దక్షిణ మధ్య రైల్వేలో 20, సదరన్ రైల్వేలో 32, నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో 20, ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 5 రైళ్లు ఉన్నాయి. రద్దు చేసిన రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు ఫోన్ మెసేజ్ ద్వార సమాచారం అందిస్తామని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.