ఏపీలో 1403 కు చేరుకున్న కేసులు… ఇళ్లలోనే చికిత్స

గత పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడం, మొత్తం కేసులు 1400కు దాటడం, ఎక్కడా వైరస్ తగ్గుముఖం సూచనలు కనిపించక పోతూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైనది. మరింత వేగంగా చికిత్స అందించేందుకు పలు చెర్యలు చేపడుతున్నది. కరోనా లక్షణాలు ఉండి, 50 ఏళ్ల లోపు వయస్సు గలవారికి తమ ఇళ్లలోనే చికిత్స పొందే సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. అయితే […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 11:39 am
Follow us on


గత పది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడం, మొత్తం కేసులు 1400కు దాటడం, ఎక్కడా వైరస్ తగ్గుముఖం సూచనలు కనిపించక పోతూ ఉండడంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైనది. మరింత వేగంగా చికిత్స అందించేందుకు పలు చెర్యలు చేపడుతున్నది.

కరోనా లక్షణాలు ఉండి, 50 ఏళ్ల లోపు వయస్సు గలవారికి తమ ఇళ్లలోనే చికిత్స పొందే సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. అయితే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు లేని వారికి మాత్రమే, వైద్యుల సిఫార్సుతో అటువంటి సదుపాయం కల్పిస్తామని స్పష్టం చేశారు.

తెల్ల ఏనుగులా… ఈ సలహాదారులు?

పైగా, అటువంటి వారి నివాసం కోవిడ్ ఆసుపత్రికి సమీపంలో ఉండాలని, ఇంట్లో ప్రత్యేక వసతులు ఉండాలని కూడా తెలిపింది. అప్పుడు మాత్రమే 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండే అవకాశం కల్పిస్తారు.

ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతూ ఉండడం అధికారులకు ఆందోళన కలిగిస్తున్నది. గురువారం నాటికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1403కు చేరింది.

జిల్లాల వారీగా… కర్నూలులో 386, గుంటూరులో 287, కృష్ణాలో 246, నెల్లూరులో 84, చిత్తూరులో 80, కడపలో 73, అనంతపురంలో 61, ప్రకాశంలో 60, పశ్చిమగోదావరిలో 56, తూర్పుగోదావరిలో 42, విశాఖలో 23, శ్రీకాకుళంలో 5 కేసుల నమోదు అయ్యాయి.

బాబూ సీబీఐ విచారణకు సిద్ధమా?

కాగా, నరసరావుపేట లో కరోనా కేసులు 106కు చేరుకోవడంలో కలెక్టర్ ఆనంద్ కుమార్ పట్టణంలోని రెడ్‌జోన్‌ ప్రాంతాలతో పాటు వరవకట్ట ప్రాంతంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. ఈ నెల 3వ తేదీ వరకు నరసరావుపేటలో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో 75శాతం కేసుల్లో కరోనా లక్షణాలు బయటపడలేదు. ఇప్పటి వరకు ఉన్న 1403 కేసుల్లో 1050 కేసుల్లో లక్షణాలు కనిపించలేదు. వీరి ద్వారానే కరోనవైరస్ వ్యాప్తి చెందింది. వీరంతా 60 ఏళ్ల లోపువారుగా ప్రభుత్వం గుర్తించింది.

అలాగే 20-40ఏళ్ల లోపువారు 44-45 శాతం ఉన్నట్లు అంచనా వేస్తోంది. కరోనా కట్టడికి భూతిక దూరం పాటించడమే పరిష్కారం అని నిర్ధారించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు లక్షకు చేరువలో ఉన్నాయి. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ రేటు 1.4శాతం తగ్గింది.

ఇలా ఉండగా విజయవాడ – గుంటూరు ల మధ్య రాకపోకలను నిషేధించారు. గుంటూరు జిల్లా వైపు నుంచి విజయవాడ వెళ్లేందుకు ఉన్న ఒక్కేఒక్క మార్గమైన కనకదుర్గ వారధిపై ఈ అంసుఖాలు విధించారు.

కరోనా నేపధ్యంలో జిల్లాలు మారకూడదని వాహనదారులకు ఆదేశాలు జారీ చేస్తూ మణిపాల్ హాస్పిటల్ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అయితే అత్యవసర వాహనాలను, జిల్లా ఉన్నత అధికారులు జారీ చేసిన ప్రత్యేక పాసులు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తామని తాడేపల్లి పోలీసులు తెలిపారు.

Tags