సరిహద్దు జిల్లాలకు కేసీఆర్ హెచ్చరిక!

తెలంగాణ ప్రజలెవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కేసీఆర్ సర్కార్ సరిహద్దు జిల్లాలకు కీలక అదేశాలు జారీ చేసింది. ఏపీ, మహారాష్ట్ర లకు వెళ్లకుండా సర్కార్ నిషేధం విధించింది. కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్ర, మహారాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యం, అత్యవసర పనులకు కూడా ఆయా వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల […]

Written By: Neelambaram, Updated On : May 1, 2020 11:27 am
Follow us on

తెలంగాణ ప్రజలెవరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కేసీఆర్ సర్కార్ సరిహద్దు జిల్లాలకు కీలక అదేశాలు జారీ చేసింది. ఏపీ, మహారాష్ట్ర లకు వెళ్లకుండా సర్కార్ నిషేధం విధించింది. కరోనా వ్యాధి తీవ్రత నేపథ్యంలో సరిహద్దు జిల్లాలలో నివసిస్తున్న పౌరులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్ర, మహారాష్ట్రాలలో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంది. వైద్యం, అత్యవసర పనులకు కూడా ఆయా వెళ్లడానికి వీలు లేదని సరిహద్దుల్లోని ప్రాంతాల ప్రజలను ఆదేశించింది. నిర్ణయ అమలుకు పోలీసు బలగాలను పెంచింది. భద్రతను కట్టుదిట్టం చేసింది. కర్నూలులో కరోనా కేసులు ఎక్కువగా ఉండడం.. తెలంగాణలోని గద్వాల, మహబూబ్‌ నగర్‌ జిల్లాల ప్రజలు అక్కడికి వెళుతున్న నేపథ్యంలో రాకపోకలను నిషేధించింది. అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లాల వాళ్లు కూడా కృష్ణ విజయవాడ, గుంటూరు వైపు వెళ్లడానికి వీలు లేకుండా ప్రభుత్వం భద్రతను పెంచింది.