spot_img
Homeజాతీయ వార్తలుటీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు

టీఆర్ఎస్ వేటకు కాంగ్రెస్ కుదేలు


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది నల్గొండ జిల్లానే. తెలంగాణ ఏర్పడ్డ కొత్తలో తెలంగాణ వ్యాప్తంగా సత్తా చాటిన టీఆర్ఎస్ పార్టీ నల్గొండలో మాత్రం కాంగ్రెస్ ధాటికి నిలవలేకపోయింది. అప్పుడు ఆ జిల్లాలో ఒక్క జగదీష్ రెడ్డి మాత్రమే గెలవగలిగాడు.. మంత్రి అయ్యాడు. అయితే రెండో దఫా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ట్రెయిన్ రివర్స్ అయ్యింది. టీఆర్ఎస్ మెజార్టీ స్థానాలు గెలవగా.. కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక స్థానానికి పరిమితమైంది.

Also Read: రాజాసింగ్ కు అసలు భద్రత ఎందుకు పెంచారో తెలుసా?

2018 ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ సత్తా చాటింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఉద్దండులు, ఫైర్ బ్రాండ్స్ లను సైతం మట్టి కరిపించింది. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి సహా బడా బడా కాంగ్రెస్ ఉద్దండులు ఓడిపోయారు.. ఇప్పుడు టీఆర్ఎస్ మళ్లీ వేట మొదలుపెట్టడంతో కాంగ్రెస్ పట్టున్న ఓ నియోజకవర్గంలో కూడా ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోతోందట..

నల్గొండ జిల్లా నుంచి కాంగ్రెస్ తరుఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారట.. ఆ నియోజకవర్గంలో తన సన్నిహితులు, విధేయులను ఒక్కరొక్కరుగా కోల్పోతున్నాడు. అంతా టీఆర్ఎస్ లోకి కట్ట కట్టుకొని వెళుతుండడంతో రాజగోపాల్ రెడ్డికి దిక్కుతోచడం లేదు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ గెలిచింది ఒక్క మునుగోడులోనే.. మిగిలిన అన్ని అసెంబ్లీ సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. కోమటిరెడ్డి గెలవగానే బీజేపీలోకి చేరతున్నట్టు హల్ చల్ చేశాడు. అనంతరం ఇప్పుడు కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నాడు. నిలకడలేని కోమటిరెడ్డిపై నమ్మకం లేక తాజాగా ఇప్పుడు నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరారు. దీంతో కోమటిరెడ్డి తన మద్దతు దారులను పెద్ద ఎత్తున కోల్పోయాడట.. ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తప్ప కాంగ్రెస్ నేతల ఉనికే ప్రశ్నర్థకంగా ఉందట..

Also Read: పీవీకి మరో అరుదైన గౌరవాన్నిచ్చిన కేసీఆర్

ఇలా కాంగ్రెస్ పట్టున్న నియోజకవర్గంలోనూ కోమటిరెడ్డిపై అపనమ్మకంతో నేతలంతా టీఆర్ఎస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ లోనే ఉంటానని కోమటిరెడ్డి చెబుతున్నా ఇప్పుడు ఆ పార్టీకి నల్గొండ జిల్లాలో నూకలు చెల్లినట్టేనని కాంగ్రెస్ వాదులే వాపోతున్నారు. ఇలా కాంగ్రెస్ బలమున్న నల్గొండ జిల్లాలోనే ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం కావడం నిజంగా విచిత్రమే మరీ..

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version