spot_img
Homeఆంధ్రప్రదేశ్‌జ‌నానికి దూరంగా జ‌గ‌న్‌..!

జ‌నానికి దూరంగా జ‌గ‌న్‌..!

Jagan
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌నానికి దూరంగా ఉంటున్నారా? పార్టీ నేత‌ల‌కు కూడా స‌మ‌యం కేటాయించ‌ట్లేదా? చివరకు ఎమ్మెల్యేలకు కూడా టైం ఇవ్వట్లేదా? అంటే.. అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఎందుకిలా జ‌రుగుతోంది? దీనికి కారణాలేంటీ? అన్న చ‌ర్చ బ‌య‌లుదేరింది.

Also Read: దేశంలో వాట్సాప్ బ్యాన్ అవుతుందా? కేంద్రం కఠిన నిబంధనలు

వాస్త‌వానికి జ‌గ‌న్ విప‌క్ష నేత‌గా ఉన్నప్పడు నిత్యం జనంలోనే ఉన్నారు. 2014లో ఓటమి తర్వాత ప్ర‌జ‌ల‌తో మ‌రింత‌గా మ‌మేయం అయ్యారు జగన్. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా సాధించాలంటూ పోరాటాలు చేశారు. దీక్ష‌లు చేప‌ట్టారు. యువ‌భేరీ స‌భ‌లు వంటివి చాలా చేశారు. ఇక‌, దాదాపు ఏడాదిన్న‌ర కాలంపాటు సుదీర్ఘంగా పాద‌యాత్ర చేసి, ప్ర‌జాస‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల‌నూ చుట్టేశారు.

అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు కావస్తుంది. ఈ స‌మ‌యం చిన్న‌దేమీ కాదు. అయితే.. ఇంత కాలం గ‌డిచిపోయిన‌ప్ప‌టికీ.. ఒక్క‌సారి కూడా పార్టీ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయ‌లేదు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలను కూడా ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌లేదు. నియోజకవర్గాల్లో పార్టీలో విభేదాలు తలెత్తుతున్నా.. ప‌ట్టించుకోవ‌ట్ల‌ద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అసంతృప్త నేత‌ల‌ను పిలిచి కార‌ణాలు కూడా తెలుసుకోవ‌ట్లేదు. దీనికి కార‌ణ‌మేంటో అర్థంకాక త‌ల‌ప‌ట్టుకుంటోంది వైసీపీ కేడ‌ర్‌.

Also Read: నాడు ఎన్టీఆర్.. నేడు విష్ణువర్ధన్ రెడ్డి..

గ‌డిచిన ఇరవై నెలల కాలంలో తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకే జ‌గ‌న్ పరిమితమయ్యారని అంటున్నారు. ప్రజలతోపాటు పార్టీ క్యాడర్ ను కూడా కలిసే ప్రయత్నం చేయ‌ట్లేద‌ని చెబుతున్నారు. ఈ కార‌ణంగానే.. స్థానికసంస్థల ఎన్నికల్లో 90 శాతం స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ పెట్టినా.. సాధ్యం కాలేద‌ని చెప్పుకుంటున్నారు. జగన్ సొంత జిల్లాలో సైతం విప‌క్షాలు కొన్ని స్థానాలు కైవసం చేసుకున్నాయి. మ‌రి, ఇప్పటికైనా జగన్ జనం బాట పడతారా? లేదా? చూడాల్సి ఉంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper
Exit mobile version