అపాయింట్‌మెంట్‌ ఇచ్చినంత మాత్రాన కలుపుకున్నట్లేనా..?

బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేస్తున్నారు. కానీ.. వారు అస్సలు దగ్గరకు రానివ్వడం లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టీడీపీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరికింది. దీంతో టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పార్టీలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఎట్టకేలకు అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీలు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు. Also Read: షాకింగ్: అచ్చెన్నాయుడును అరెస్టు చేయించింది నిమ్మగడ్డనేనా? […]

Written By: Srinivas, Updated On : February 4, 2021 10:36 am
Follow us on


బీజేపీ అగ్రనేతల అపాయింట్‌మెంట్‌ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నాళ్లుగానో వెయిట్‌ చేస్తున్నారు. కానీ.. వారు అస్సలు దగ్గరకు రానివ్వడం లేదు. దాదాపు రెండేళ్ల తర్వాత ఎట్టకేలకు టీడీపీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ దొరికింది. దీంతో టీడీపీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పార్టీలో రెట్టించిన ఉత్సాహం కనిపిస్తోంది. ఎట్టకేలకు అమిత్‌షాను కలిసిన టీడీపీ ఎంపీలు.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించారు.

Also Read: షాకింగ్: అచ్చెన్నాయుడును అరెస్టు చేయించింది నిమ్మగడ్డనేనా?

ప్రధానంగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, మతమార్పిడులు, టీడీపీ నేతలపై నమోదవుతున్న అక్రమ కేసులు, దాడుల విషయాన్ని కూడా అమిత్ షా వద్ద ప్రస్తావించారు. అమిత్ షాతో భేటీ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన ఎంపీలు తమకు అమిత్ షా హామీ ఇచ్చారని చెప్పారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలను సమర్పించాలని కోరినట్లు చెప్పారు. తాము ఆధారాలతో సహా హోంశాఖకు సమర్పిస్తామని తెలిపారు. అమిత్ షాతో భేటీ కేవలం నిమిషాల వ్యవధిలోనే జరిగిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ఎంపీలు ఇచ్చిన వినతి పత్రాన్ని అమిత్ షా స్వీకరించారని అంతకుమించి అక్కడ ఏమీ జరగలేదని వెంటనే బీజేపీ నేతలు రియాక్ట్ కావడం విశేషం.

2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చాక బీజేపీ నేతలతో టీడీపీ నేతలు కలిసింది లేదు. పైగా ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై పార్టీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేశారు. తిరుపతి వచ్చిన అమిత్ షాపైనా టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఇవన్నీ ఎలా మర్చిపోతామని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకూ ఢిల్లీ గడప కూడా తొక్కలేదు. రెండేళ్ల తర్వాత తొలిసారి అమిత్ షా టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: పంచాయతీ ఎన్నికల్లో నోట్ల హవా: అడ్డంగా బుక్కైన టీడీపీ నేతలు

మరోవైపు.. అమిత్ షా అపాయింట్‌మెంట్ మంచి సంకేతాలని టీడీపీ భావిస్తోంది. భవిష్యత్‌లో కలిసి పనిచేసేందుకు తొలి అడుగు పడిందంటున్నారు. కానీ.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఆలోచన ఉంటే అప్పుడు తాము నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. మొత్తానికి టీడీపీలో మాత్రం తమ ఫిర్యాదుపై అమిత్ షా స్పందించకున్నా పరవాలేదు కాని, అపాయింట్‌మెంట్ ఇచ్చారు చాలన్న తృప్తి మాత్రం వారిలో కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్