spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనుంది. కూటమి ప్రభుత్వం ఇద్దరి నేతల పేర్లను సిఫారసు చేయనుంది. అయితే ఈసారి ఆ ఇద్దరు నేతలు టిడిపికి చెందినవారు అవుతారని అంతా భావిస్తున్నారు. ఆ రెండు పదవులు తీసుకోవాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకే ఇప్పుడు సమయం దగ్గరవుతుండడంతో ఇద్దరు నేతల ఎంపిక అనివార్యంగా మారింది. అయితే టిడిపిలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కానీ సామాజిక సమీకరణలతో పాటు సీనియారిటీని గుర్తించాలని భావిస్తున్నారు. అటువంటి వారి ఇద్దరి పేర్లను ప్రకటించనున్నారు.

* ఆశిస్తున్న సీనియర్లు..
ప్రధానంగా పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన వారు ఉన్నారు. పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన వారు ఉన్నారు. అయితే సామాజిక సమీకరణలో భాగంగా ఈసారి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒకరిని.. రాయలసీమ బలిజ/ కాపు సామాజిక వర్గం వారి నుంచి ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఆ ఇద్దరు నేతల ఎంపికపై చంద్రబాబు దృష్టి పెట్టారు. కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తమకు కూడా అవకాశం ఇవ్వాలని చాలామంది జూనియర్ నేతలు సైతం కోరుతున్నారు. అయితే రాజ్యసభ పదవి ఆశించిన నేతలకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

* వర్ల రామయ్యకు ఖరారు..
ప్రధానంగా వర్ల రామయ్యకు పదవి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి అనేసరికి వర్ల రామయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తూ వచ్చింది. ఒకసారి ఓడిపోతానని తెలిసి కూడా పార్టీ ఆదేశాలు మేరకు రామయ్య పోటీ చేశారు. మొన్నటి రాజ్యసభ పదవులు ఎంపికలో సైతం వర్ల రామయ్య పేరు వినిపించింది. అందుకే ఒక పదవిని ఆయనకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక రెండో స్థానం రాయలసీమ నుంచి ఎంపిక చేయనున్నారు. సీనియర్ నేత సుగవాసి ప్రసాద్ బాబుకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 2012లో రాయచోటి నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. గత మూడు ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేశారు. ప్రసాద్ బాబు సేవలను గుర్తించిన పార్టీ హై కమాండ్ ఎమ్మెల్సీ ఇస్తామని గతంలోనే బాహటంగానే ప్రకటించింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రసాద్ బాబును ఈసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....
Oktelugu Epaper
Exit mobile version