spot_img
Homeఆంధ్రప్రదేశ్‌బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?

బాబు మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నారా?


ఎవరైనా ఒకసారి తప్పుచేసి బొక్కబొర్లా పడితే దాని నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నారు. మళ్లీ అలాంటివి జరుగకుండా జాగ్రత్త పడతారు. ఇది రాజకీయాల్లో ఉన్నవారికి అత్యంత అవసరం. 40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మాత్రం చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ టీడీపీ విషయంలో చంద్రబాబు చేసిన తప్పునే ప్రస్తుతం ఏపీలోనూ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తన ట్రాప్ లోకి లాగి తెలంగాణలో టీడీపీ దెబ్బతీశారు. దీంతో తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితికి చేరింది.

Also Read: ఆంధ్రాలో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు క్రమంగా జగన్మోహన్ రెడ్డి ట్రాప్ లో పడుతున్నారు. గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి ఏపీలో అమలు చేస్తున్నారు. టీడీపీని ఒక ప్రాంతానికి పరిమితం చేసేలా కేసీఆర్ నాడు ఎలా సక్సస్ అయ్యారో అలానే జగన్ కూడా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ వ్యూహాంలో భాగంగానే మూడు రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారు. ఈ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడిని అమరావతికే పరిమితం చేయడం ద్వారా మిగిలిన ప్రాంతంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగులుతున్నాయి. జగన్ మూడు రాజధానుల అంశంతో అన్ని ప్రాంతాల్లో వైసీసీ బలపడుతోంది. ఇక టీడీపీ మాత్రం జై అమరావతి స్లోగన్ తీసుకోవడంతో రాయలసీమ, ఉత్తారంధ్రలో ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. చంద్రబాబు ఏపీకి సీఎం అయ్యాక తెలంగాణపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో ఈ ప్రాంతంలో దాదాపుగా టీడీపీ కనుమరుగైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి రాజధానిపైనే ఫోకస్ పెట్టి మిగిలిన ప్రాంతాలను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ ప్రాంతాల్లో టీడీపీ కనుమరుగు అవడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నాయి.

Also Read: బీజేపీ-జనసేన పొత్తులో సీఎం అభ్యర్థి ఎవరు?

చంద్రబాబు నాయుడు తన అనుభవంతో కర్నూలు, విశాఖ ప్రాంతాలను ఏవిధంగా అభివృద్ధి చేయాలో చెప్పి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటిస్తే రాజకీయంగా అన్ని ప్రాంతాల్లో టీడీపీకి మైలేజ్ ఉండేది. కానీ బాబు మాత్రం కేవలం జై అమరావతి స్లోగన్ తీసుకోవడంతో మిగిలిన ప్రాంతాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తమ ప్రాంతానికి రాజధాని వస్తే బాబు అడ్డుకుంటున్నారని ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో టీడీపీ నేతలు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఇక టీడీపీ నేతలు చేసేదిలేక అధికార పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. బాబును ఒక ప్రాంతానికి పరిమితం చేయడంలో జగన్ సక్సస్ అవుతున్నారు. టీడీపీ కేవలం అమరావతికే పరిమితం అయితే వచ్చే ఎన్నికల్లో బాబు అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు ఇకనైనా జగన్ ట్రాప్ నుంచి బయట పడుతారో లేదో వేచి చూడాల్సిందే..!

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper
Exit mobile version