Homeఆంధ్రప్రదేశ్‌ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు మళ్లీ ఝలక్‌

ఆ బిల్లు రెండో సారి వెనక్కి..! ఏపీ పెద్దలకు మళ్లీ ఝలక్‌

AP Bills
శాసనంలో ఓ చట్టం చేయడం అంత ఈజీ అయిన పనికాదు. ప్రభుత్వ పెద్దలకో.. మరొకరికో వచ్చిన ఆలోచనలను పేపర్ మీద పెట్టేసి అసెంబ్లీలో ఆమోదించడం కాదు. దానికి ఎంతో లోతుగా కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఇదంతా అధికారులు పూర్తి చేయాలి. రాజ్యాంగ నిబంధనలు.. కేంద్ర చట్టాలు.. అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చట్టం చేయాలి. అప్పుడే అది చెల్లుబాటవుతుంది. ఈ మాత్రం రూల్స్‌ కూడా అటు ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలిసే ఉండాలి.

Also Read: పేకాట ఆడితే తప్పేముంది..? ఏపీ మంత్రుల నీతి వాక్యాలు

కానీ.. ఏపీలో అధికారులకు ఆ స్వేచ్ఛ లేకనో.. ఒకవేళ చట్టాలంటే పూర్తి అవగాహన లేకనో తెలియదు కానీ.. అసెంబ్లీలో పాస్ చేసి పంపించిన వాటిని బిల్లలను చెల్లవని కేంద్రం వెనక్కి పంపుతోంది. గతంలో దిశ లాంటి చట్టాలు వెనక్కి వచ్చాయి. ఇప్పుడు.. ల్యాండ్ టైటిల్ బిల్లు కూడా వెనక్కి వచ్చింది. ఈ బిల్లు ఒక్క సారి కాదు రెండు సార్లు వెనక్కి రావడం ప్రభుత్వం పెద్దల వైఫల్యాలను వెల్లడి చేస్తోంది.

ఏపీ సర్కారు 2019లోనే ల్యాండ్‌ టైటిల్‌ బిల్లును తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత కేంద్రం ఈ బిల్లును తిరస్కరించి గత నవంబరులో వెనక్కి పంపించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు-2020 (భూమి హక్కు) పేరుతో ఏపీ సర్కార్ ఓ చట్టం చేసింది. ఆమోదం కోసం కేంద్రానికి పంపింది. ఇందులో రాజ్యాంగ ఉల్లంఘనలు ఉన్నాయని.. సవరించాలని కేంద్రం వెనక్కి పంపింది. అయితే మళ్లీ ఆ సవరణలు చేయకుండా డొంక తిరుగుడుగా బిల్లు రూపొందించి పంపారు. దీంతో కేంద్రం నిర్మోహమాటంగా మళ్లీ బిల్లును వెనక్కి పంపించేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లును మూడో సారి అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేంద్రానికి పంపాల్సి ఉంది. అప్పుడైనా ఆమోదిస్తారా లేదా అన్నది కూడా ఉత్కంఠే. ఎందుకంటే ఏపీలో బిల్లులు తయారు చేస్తున్న యంత్రానికి రాజ్యాంగంలో బేసిక్స్ కూడా తెలియని పరిస్థితి ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కేంద్ర నుంచి చట్టానికి అనుమతి రానేలదు.. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే ప్రారంభించారు.

Also Read: సొంత పార్టీకే ఎసరుపెట్టిన చింతమనేని

భూములకు పట్టాలిస్తామని.. పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ.. అసలు చేసిన చట్టమే రాజ్యాంగ విరుద్ధంగా ఉందని తేలింది. ల్యాండ్ టైటిల్ చట్టంలో కేంద్రం అభ్యంతరాలు చెబుతున్నప్పటికీ.. కొన్ని అంశాలను తీసేడానికి ఏపీ సర్కార్ ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఆ చట్టానికి ఆమోదం లభిస్తే.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విషయంలో ఇష్టారీతిన పట్టాలు, ధృవీకరణ పత్రాలు జారీ చేయడం వంటివిచేసి.. అక్రమాల పుట్ట చేసే ప్రమాదం ఉందన్న ఆందోళన సామాన్యుల్లో కనిపిస్తోంది. మొత్తానికి ఏపీ సర్కార్‌ పెద్దలకు రాజ్యాంగంపై పెద్దగా అవగాహన లేదని ఈ బిల్లును చూస్తే మరోసారి రుజువైంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version