Homeజాతీయ వార్తలుUP Elections: యూపీలో మళ్లీ గెలుపు పక్కా అంటున్న బీజేపీ.. కమలనాథుల ధీమాకు కారణం ఏంటి..?

UP Elections: యూపీలో మళ్లీ గెలుపు పక్కా అంటున్న బీజేపీ.. కమలనాథుల ధీమాకు కారణం ఏంటి..?

UP Elections: దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్..అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. కమలనాథులు ఇందుకు పక్కా వ్యూహాలు రచించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గతంలో కంటే ఎక్కువ సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని కమలనాథులు అంటున్నారు. 350కిపైగా సీట్లు పక్కాగా వస్తాయని ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

UP Elections
UP Elections

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తమను మళ్లీ గెలిపిస్తాయని, తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని సీఎం యోగి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలపైన యోగి ఫైర్ అయ్యారు. ప్రియాంక ఎలక్షన్ టూరిజం, అఖిలేశ్ వ్యూహాలు ఏవీ కూడా యూపీలో పని చేయవని విమర్శించారు. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.

తాము గతంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ‘లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర’లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని, ఈ నేపథ్యంలో యూపీ ప్రజలు తమ వెంటే ఉంటారని యోగి అంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గానూ 350కిపైగా సీట్లను బీజేపీ గెలుచుకుంటున్నదని జోస్యం చెప్పారు. దేశంలో అభివృద్ధికి కేరాఫ్‌గా యూపీ ఉందని, రాష్ట్రంలోని 24 కోట్ల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోని మోడీ సర్కారు సహకారంతో పాటు పడిందని తెలిపారు.

Also Read: ‘జగనాలూ’.. కాచుకో ఇక.. ‘ప్రత్యేక హోదా’ రగిలిస్తున్న చంద్రబాబు!
తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ. 36 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని, తద్వారా 21 మిలియన్ల మంది రైతులకు మేలు జరిగిందని గుర్తు చేశారు సీఎం యోగి. భారతదేశ అభివృద్ధిలో యూపీదే కీలక పాత్రని తెలిపారు. భారత్ గ్లోబల్ ఎకానమీగా మారడంలో ఉత్తరప్రదేశ్ కీ రోల్ ప్లే చేస్తోందని పేర్కొన్నారు. ఇక ఇప్పటికే నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం.. యూపీలో మళ్లీ కమలనాథులే గెలవబోతున్నట్లు సమాచారం. అయితే, కొన్ని స్థానాల్లో ఎస్పీ పోటీ ఇవ్వబోతున్నదని, కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందని తెలుస్తోంది.

Also Read: గోవా కాంగ్రెస్ లో అసమ్మతి.. పార్టీ పరిస్థితి అధోగతి

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper