Political Parties: ఆస్తుల లెక్క: బీజేపీ టాప్.. కాంగ్రెస్ ఘోరం.. ప్రాంతీయపార్టీల్లో టీఆర్ఎస్ నంబర్ 2.. అప్పుల్లో టీడీపీ

Political Parties: అధికారంలో ఉండడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. ఒకప్పుడు దేశంలో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఇప్పుడు రెండు సార్లు సొంతంగా అధికారంలోకి రాగలిగింది.. ఈ క్రమంలోనే డబ్బులు కూడా ఆ పార్టీకి విరాళాల రూపంలో బోలెడు వచ్చిపడుతున్నాయి. దీంతో దేశంలోనే సంపన్న రాజకీయ పార్టీగా బీజేపీ అవతరిస్తోంది. మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటింది. వరుసగా రెండు సార్లు అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ కేంద్రంలో సొంతంగా […]

Written By: NARESH, Updated On : January 29, 2022 11:37 am
Follow us on

Political Parties: అధికారంలో ఉండడం బీజేపీకి బాగా కలిసి వచ్చింది. ఒకప్పుడు దేశంలో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన బీజేపీ ఇప్పుడు రెండు సార్లు సొంతంగా అధికారంలోకి రాగలిగింది.. ఈ క్రమంలోనే డబ్బులు కూడా ఆ పార్టీకి విరాళాల రూపంలో బోలెడు వచ్చిపడుతున్నాయి. దీంతో దేశంలోనే సంపన్న రాజకీయ పార్టీగా బీజేపీ అవతరిస్తోంది. మరే జాతీయ పార్టీకి సాధ్యం కాని రీతిలో సత్తా చాటింది.

వరుసగా రెండు సార్లు అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా బీజేపీ అత్యధిక ఆస్తులు కలిగిన పార్టీగా అవతరించింది.

2019-20 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ.4847.78 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించి దేశంలోనే సంపన్న పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే కమలం పార్టీ ఆస్తుల విలువ ఏకంగా 8 రెట్లకు పైనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రసీ రిఫామ్స్ (ఏడీఆర్) ఓ నివేదికను రూపొందించింది. ఈ ప్రకారం జాతీయ, ప్రాంతీయ పార్టీల ఆస్తులను, అప్పులను అధ్యయనం చేసి బయటపెట్టింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం.. దేశంలోనే సంపన్న పార్టీగా బీజేపీ అవతరించింది. మొత్తం 7 జాతీయ పార్టీలు ప్రకటించిన ఆస్తుల విలువ మొత్తం రూ.6988.57 కోట్లుగా ఉంది. ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తులు రూ.2129.38 కోట్లుగా ఉంది. ఇందులో ఒక్క బీజేపీనే రూ.4847.78 కోట్ల ఆస్తులను ప్రకటించింది.

ఏడు జాతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో దాదాపు 70శాతం ఒక్క బీజేపీదే కావడం గమనార్హం. ఆ తర్వాత రూ.698.33 కోట్ల ఆస్తులతో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి రూ.588.16 కోట్లు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. అంటే బీజేపీ తర్వాత బీఎస్పీ రెండోస్థానంలో ఉంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మూడో స్థానానికి ఘోరంగా దిగజారిపోయింది.

ఇక 44 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తుల విలువలో 95.27 శాతం అంటే రూ.2028.71 కోట్లు 10 ప్రాంతీయ పార్టీలవే అని నివేదిక వెల్లడించింది. ప్రాంతీయ పార్టీల్లో రూ.563.47 కోట్ల ఆస్తులతో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ.301.47 కోట్ల ఆస్తులతో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అన్నాడీఎంకే రూ.261.61 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉంది.

ఇక అప్పుల పాలైన పార్టీలు కూడా ఉన్నాయి. 7 జాతీయ, 44 ప్రాంతీయ పార్టీల మొత్తం అప్పులు రూ.134.93 కోట్లుగా ఉన్నాయి. ఇందులో 74.27 కోట్లు జాతీయ పార్టీల అప్పులు కాగా.. ఒక్క కాంగ్రెస్ పార్టీనే 49.55 కోట్ల రుణాలు బాకీ పడినట్లు ఏడీఆర్ నివేదిక తెలిపింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రూ.11.32 కోట్ల మేర అప్పులు ఉన్నట్లుపేర్కొంది.

ఇక చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి రూ.30.34 కోట్లు, డీఎంకేకు రూ.8.05 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఇలా ఆస్తుల్లో బీజేపీదే మెజార్టీ వాటాగా తిరుగులేనిదిగా ఉంది. అధికార పార్టీలు అత్యంత ఆస్తులను కలిగి ఉండగా.. ప్రతిపక్షాలు అప్పులపాలై ఉన్నాయి.