spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Mekapati Goutham Reddy Death: ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో...

Mekapati Goutham Reddy Death: ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మల శాఖ మంత్రి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో మృతి

Mekapati Goutham Reddy Death: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ రోజు ఉద‌యం గుండెపోటు రావ‌డంతో ఆస్స‌త్రికి త‌ర‌లించారు. కానీ అప్ప‌టికే ఆయ‌న తుది శ్వాస విడిచిన‌ట్లు వైద్యులు ధ్రువీక‌రించారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాద ఛాయ‌లు అలుముకున్నారు. వైసీపీలో కీల‌క నేత దూరం కావ‌డంతో నేత‌లు జీర్ణించుకోలేకేపోతున్నారు. త‌మ అనుచ‌రుడిని కోల్పోవ‌డం బాధాక‌రంగా ఉంద‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

Mekapati Goutham Reddy Death
Mekapati Goutham Reddy Death

విష‌యం తెలుసుకున్న వెంట‌నే సీఎం జ‌గ‌న్ తాడేపల్లి నుంచి హైద‌రాబాద్ కు బ‌య‌లుదేరారు. త‌మ స‌హ‌చ‌రుడిని క‌డ‌సారి చూసుకునేందుకు వ‌స్తున్నారు. మ‌రోవైపు గౌత‌మ్ రెడ్డి ప్ర‌భుత్వం కోసం పెట్టుబ‌డులు తీసుకొచ్చేందుకు దుబాయి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లి ఆదివారమే స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చారు. ఇంత‌లోనే ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

Also Read:  ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?

మేక‌పాటి కుటుంబంతో ఉన్న అనుబంధం నేప‌థ్యంలో జ‌గ‌న్ త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ప్ర‌భుత్వంలో కీల‌క నేత‌గా ఉన్న గౌత‌మ్ రెడ్డి దూరం కావ‌డం భ‌రించ‌లేనిద‌ని త‌న మ‌న‌సులోని బాధ‌ను వ్య‌క్తం చేశారు. 2014 నుంచి ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు గెలిచారు. జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు.

Mekapati Goutham Reddy Death
Mekapati Goutham Reddy Death

ఎప్పుడు ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యేందుకు గౌత‌మ్ రెడ్డి ఇష్ట‌ప‌డ‌తారు. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచినందుకు వారికి ఏదో చేయాల‌నే త‌ప‌న ఆయ‌న‌లో ఉండ‌టం తెలిసిందే. వివాదార‌హితుడుగా పేరున్న ఆయ‌న ప్ర‌జ‌ల కోస‌మే త‌న జీవితం అంకితం చేశారు. ప్ర‌జాసేవ‌లోనే క‌న్ను మూశారు. దీంతో ఏపీ ప్ర‌జ‌లు దుఖ‌సాగ‌రంలో మునిగిపోయారు. త‌మ ప్రియ‌త‌మ నేత‌ను కోల్పోవ‌డం బాధాక‌రంగా ఉంద‌ని చెబుతున్నారు.

యాభై ఏళ్ల వ‌య‌సులోనే ఆయ‌న చ‌నిపోవ‌డం బాధాక‌ర‌మే. ఎప్పుడు జిమ్ చేస్తూ ఆరోగ్యంగా ఉండే ఆయ‌న‌కు గ‌తంలో క‌రోనా సోకింద‌ని తెలుస్తోంది. దీంతోనే గుండెపోటు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మొత్తానికి గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణం రెండు రాష్ట్రాల్లోనూ విషాదం నింపింది.

Also Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: పంజాబ్ లో గెలుపెవరిది?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Thammineni Seetharam

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...
Chennai Love Story Movie

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...
YSRCP

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....
Oktelugu Epaper