spot_img
Homeజాతీయ వార్తలుJageshwar Prasad Awasthi case: రూ.100 లంచం తీసుకున్నాడని 39 ఏళ్ల జైలు శిక్ష.. కానీ...

Jageshwar Prasad Awasthi case: రూ.100 లంచం తీసుకున్నాడని 39 ఏళ్ల జైలు శిక్ష.. కానీ ఇప్పుడు నిర్దోషి.. ఈయన జీవితం తెలిస్తే కన్నీళ్లే..

Jageshwar Prasad Awasthi case: ప్రస్తుత కాలంలో ఎవరైనా ఏసీబీ అధికారులకు రైట్ హ్యాండ్ గా పట్టుబడితే వారిని సస్పెండ్ చేస్తున్నారు. కానీ ఆ తర్వాత ఎలాగో అలా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్నారు. మరికొందరు అయితే ప్రమోషన్ కూడా పొందుతున్నారు. కానీ ఒక వ్యక్తి రూ. 100 లంచం తీసుకున్నాడని అతనికి కోర్టు 39 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే 2025లో అతడు నిర్దోషి అని కోర్టు తేల్చింది. ఇంతకాలం జైలు శిక్ష అనుభవించిన అతడు తన జీవితం మాత్రమే కాకుండా తన కుటుంబ జీవితాన్ని కోల్పోయాడు. ఈ 39 ఏళ్ల కాలంలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు తెలిస్తే కన్నీళ్లు రాక మానవు. ఇంతకీ స్టోరీ ఏంటంటే..

చత్తీస్గడ్ రాష్ట్రంలోని రాయపూర్ కు చెందిన జగేశ్వర్ ప్రసాద్ అవాడియా 1986 కాలంలో మధ్యప్రదేశ్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బిల్లు అసిస్టెంట్ గా విధులు నిర్వహించేవారు. ఈ ఏడాది అక్టోబర్ 4న అతడిని అశోక్ కుమార్ వర్మ అనే ఉద్యోగి బిల్లులు పాస్ చేయాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. కానీ ఆయన ససేమిరా అనడంతో జోగేశ్వర్ ప్రసాద్ జేబులో వంద రూపాయలను ఉంచాడు. కానీ ఇదే సమయంలో విజిలెన్స్ అధికారులు అక్కడికి వచ్చి కేసు నమోదు చేశారు. ఈ సమయంలో అతని వద్ద సైకిల్, గడియారం, కాపీ పుస్తకాలు తప్ప మరేమీ దొరకలేదు. అయితే కేసు నిర్ధారణ చేసి జైలుకు పంపించారు.2004 సంవత్సరంలో అతనికి జైలు శిక్ష పడింది. అదే సంవత్సరం కోర్టుకు అప్పేలు చేశారు. కానీ దీనిపై నిర్ణయం తీసుకోవడానికి 21 సంవత్సరాలు పట్టింది. ఇలా 39 ఏళ్ల పాటు జైల్లో ఉన్న తర్వాత 2025లో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది.

ఈ 39 ఏళ్ల కాలంలో అతడు జైలు శిక్ష అనుభవించడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కోల్పోయాడు. జగేశ్వర్ ప్రసాద్ అవాడియా పై కేసు నమోదు కావడంతో అతడిని సస్పెండ్ కు గురయ్యాడు. దీంతో అతడికి సగం జీవితం మాత్రమే వచ్చింది. ఈ సగం జీవితం సరిపోక అతని కుటుంబం అవస్థలు పడింది. తన భర్త జైలులోకి వెళ్లడంతో కుటుంబాన్ని పోషించలేక భార్య మరణించింది. అంతేకాకుండా తండ్రి జైలులో.. తల్లి మరణం తర్వాత పిల్లలు చదువుకు దూరం అయ్యారు. అయితే అతని పెద్దకొడుకు కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొస్తున్నాడు. అంతేకాకుండా జగేశ్వర్ ప్రసాద్ పిల్లలు ఎక్కడికి వెళ్లినా మీ తండ్రి లంచం తీసుకున్నాడు అంటూ అందరూ హేళన చేసేవారు. ఈ అవమానాలతో వారు తీవ్ర ఆవేదన చెందేవారు.

అయితే ప్రస్తుతం జగేశ్వర్ ప్రసాద్ నిర్దోషి అని తేలినా ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అతడు జీవించడానికి కనీసం ఇల్లు కూడా లేకుండా పోయింది. చిన్న ఇరుకు ఇంట్లో నివసిస్తున్నాడు. కుమార్తెలకు ఎలాగోలా పెళ్లిళ్లు అయ్యాయి. పెద్ద కుమారుడు ప్రైవేట్ జాబ్ చేయడానికి బయటకు వెళ్లారు. ప్రస్తుతం చిన్న కుమారుడితో జగేశ్వర్ ప్రసాద్ జీవిస్తున్నాడు. 39 ఏళ్లకాలంలో తన కుటుంబం కోల్పోయింది.. జీవితం నాశనమైంది.. కానీ తనకు వచ్చే పెన్షన్ లేదా ఇతర సౌకర్యాలు అయిన ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

America Politics: అమెరికాకు యువ అధ్యక్షురాలు.. పోల్స్ తో ఈ 36 ఏళ్ల మహిళకే ఓటు

America Politics: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి ఏడాదిన్నర అయింది. నాలుగేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంతకుముందు జోబైడెన్‌ అధ్యక్షుడిగా...

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version