Homeఆంధ్రప్రదేశ్‌వైసీపీలోకి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు జంప్?

వైసీపీలోకి ఐదుగురు టీడీపీ ఎమ్మెల్సీలు జంప్?


రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న శాసన మండలి ఇప్పట్లో రద్దయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే శాసన సభ మండలిని రద్దు చేయాలని కోరుతూ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర పరిశీలించి పార్లమెంట్ సమావేశాల్లో అందుకు సంబంధించిన బిల్లును సిద్ధం చేసి లోక్ సభలో ఆమోదించిన అనంతరం రాజ్య సభలో ఆమోదిస్తే గాని మండలి రద్దయ్యే అవకాశం లేదు. కరోనా వైరస్ తో సమస్యలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లుకు అంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసిందెవరు?

మరోవైపు మండలిలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామా చేసి కొద్ది రోజుల కిందట వైసీపీలో చేరారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. మండలి రద్దు నిర్ణయంతో తొలుత వైసీపీ ఆ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉండదని అందరూ భావించారు. నామినేషన్ దాఖలుకు చివరి రోజు వైసీపీ అభ్యర్థిగా డొక్కాను ప్రకటిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి.

వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

ఇదే ఆఫర్ తమకు ఇస్తే పార్టీ మారేందుకు టీడీపీ ఎమ్మెల్సీలు ఐదుగురు సిద్ధంగా ఉన్నారని తెలిసింది. అధికార పార్టీ అంగీకరిస్తే టీడీపీ నుంచి జంప్ చేసేస్తామంటూ వారి అభిప్రాయాన్ని వైసీపీలోని ఓ ముఖ్య నేతను కలిసి వీరంతా వెలిబుచ్చినట్లు తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే బాటలో అధికార పార్టీలోకి మరికొందరు టీడీపీ ఎమ్మెల్సీలు వెళ్లే అవకాశం లేకపోలేదని సమాచారం. పవర్ పాలిటిక్స్ కాబట్టి తప్పులేదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు మండలి రద్దయ్యే అవకాశాలు లేకపోవడంతో మండలిలో తమ బలం పెంచుకునేందుకు చర్యలు తీసుకోక వైసీపీకి మరో మార్గం లేదు. శాసన సభలో వైసీపీకి 151 సీట్లు ఉన్నా మండలిలో సరైన బలం లేకపోవడంతో తమకు అవసరమైన బిల్లులు ఆమోదించుకుని చట్టాల రూపంలో తెచ్చుకునే పరిస్థితి అధికార పక్షానికి లేదు. కాబట్టి పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్సీలను రాజీనామా చేసిన అనంతరం ఆ సీటు వారికే ఇచ్చే ఒప్పందంతో పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

TDP MLA

TDP MLA: మారుతున్న టిడిపి ఎమ్మెల్యే వైఖరి.. ఏంటి కథ?!

TDP MLA: తెలుగుదేశం పార్టీకి వీర విధేయులైన నేతలు చాలామంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో సైతం వెన్నంటి నడిచిన వారు చాలామంది ఉన్నారు. అటువంటి వారిలో బోండా ఉమామహేశ్వరరావు ఒకరు. విజయవాడకు చెందిన...
Newtons Third Law

Newtons Third Law: న్యూటన్స్ థర్డ్ లా మూవీ ట్రైలర్ రివ్యూ..

Newtons Third Law: సమంత్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాల మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉంటాయి. ఆయన ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. ఆ మూవీని కల్ట్ క్లాసికల్...
Corona alert in AP

Corona alert in AP: ఏపీలో కరోనా అలెర్ట్.. ఒక్క రోజులోనే పది!

Corona alert in AP: ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తరకం వేరియంట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల వ్యవధిలో పది కేసులు నమోదు కావడం గమనార్హం....
Operation Aranya

Operation Aranya: ‘ఆపరేషన్ అరణ్య’పై పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్!

Operation Aranya: ఎర్రచందనం స్మగ్లర్ల పై ప్రత్యేకంగా గురి పెట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన అటవీ శాఖ బాధ్యతలను కూడా చూస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎర్రచందనం స్మగ్లింగ్...
VVS Laxman

VVS Laxman: టీమిండియా కు లక్కీ లక్ష్మణ్… ఆ గౌతమ్ గంభీర్ ను సాగనంపండి సార్

VVS Laxman: ముక్కు మీద కోపం లేదు. ముఖం మీద చిరునవ్వు మాత్రమే ఉంటుంది. ఫ్రస్ట్రేషన్ ఉండదు. కేవలం సానుకూల దృక్పథం మాత్రమే ఉంటుంది. ఓటమి ఎదురైతే బాధ ఉండదు.. ఎలా గెలవాలి...
Oktelugu Epaper