spot_img
Homeహెల్త్‌Kidney Stone Prevention: కల్లు, బీర్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా?

Kidney Stone Prevention: కల్లు, బీర్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా?

Kidney Stone Prevention: మనం రోజు తిని ఆహారంలోనే ఆరోగ్యం ఉంటుందని కొందరు వైద్యులు చెబుతుంటారు. అందువల్ల ప్రతిరోజు సరైన ఆహారం.. సక్రమంగా తీసుకోవాలని అంటారు. అయితే ఇలా సరైన ఆహారం తీసుకున్నా.. ఒక్కోసారి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని పదార్థాల వల్ల ఈ వ్యాధులు వస్తుండగా.. శరీరంలో జరిగే కొన్ని మార్పుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చాలామంది ఎదుర్కొంటున్న సమస్య కిడ్నీ స్టోన్స్ స్పెయిన్. ఇవి మగ, ఆడవారిద్దరికీ వస్తున్నాయి. అయితే వీటిపై కొన్ని అపోహలు.. సందేహాలు ఉన్నాయి. వాటి గురించి వివరాల్లోకి వెళితే..

శరీరంలో యూరిక్ ఆసిడ్ వల్ల లేదా నీటి శాతం తగ్గి.. డిహైడ్రేషన్కు గురికావడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి. ఈ కిడ్నీ స్టోన్స్ ఫోర్ ఎం ఎం నుంచి 5ఎంఎం వరకు ఉంటాయి. ఇవి 5 ఎం ఎం ఉన్నప్పుడు తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే కొందరికి నడుమునొప్పి వచ్చినప్పుడు కూడా కిడ్నీ స్టోన్ పెయినా అని సందేహం వస్తుంది. వాస్తవానికి కిడ్నీ స్టోన్స్ నొప్పి నడుము పైభాగాన పక్కటెముకల పక్కన ఉంటుంది.. నడుము నొప్పి నడుము కింది భాగంలో ఉంటుంది. నడుమునొప్పి ఒకరోజు ఉండి.. మరో రోజు ఉండకపోవచ్చు. అలాగే కూర్చొని నిలబడే సమయంలో ఇది తగ్గవచ్చు. కానీ కిడ్నీ స్టోన్స్ పెయిన్ మాత్రం ఎప్పటికీ ఒకలాగే ఉంటుంది. అంతేకాకుండా ఇది తీవ్రంగా ఉంటుంది.

కిడ్నీ స్టోన్స్ సైజ్ పెరిగి ఆపరేషన్ చేసుకున్న తర్వాత వైద్యుల సూచనలను పాటించాల్సి ఉంటుంది. ఎందుకంటే తిరిగి మరోసారి స్టోన్స్ తయారయ్యే అవకాశం 50 శాతం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. టమాట ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. పాలు, పెరుగు మితంగా తీసుకోవాలి. అలాగే డిహైడ్రేషన్ కాకుండా నిత్యం వాటర్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వేసవి కాలంలో చెమట ద్వారా నీరు బయటకు వెళ్తుంది. అందువల్ల ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డిఐటేషన్ కాకుండా ఉంటుంది.

అయితే ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో కల్లు, బీర్లు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని చెబుతున్నారు. వాస్తవానికి బీర్లు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయని ఏ వైద్యులు చెప్పరు. శాస్త్రీయంగా కూడా ఎక్కడా నిరూపితం కాలేదు. బీర్లు తాగడం వల్ల డిహైడ్రేషన్ కు గురవుతారు. దీనివల్ల కిడ్నీ స్టోన్స్ కరిగే అవకాశం ఎలాగా ఉండదు. అలాగే కల్లు లో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా కిడ్నీలో ఉండే స్టోన్ కరుగుతాయని నిరూపించబడలేదు. కిడ్నీ స్టోన్స్ కరగడానికి సరైన వైద్య చికిత్స తీసుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అంతేకాకుండా కిడ్నీ స్టోన్స్ అని తెలిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Oktelugu Epaper