spot_img
Homeహెల్త్‌రేషన్ బియ్యం తినే వారికి షాకింగ్ న్యూస్..?

రేషన్ బియ్యం తినే వారికి షాకింగ్ న్యూస్..?

దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులను చూసి సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రేషన్ బియ్యమే కడుపు నిండా తిండి తినడానికి కారణమవుతోంది. లక్షల సంఖ్యలో కుటుంబాలకు రేషన్ బియ్యం వల్లే అంతోఇంతో ఖర్చు తగ్గుతోంది.

అయితే చివరకు తినే రేషన్ బియ్యం సైతం కల్తీ అవుతూ ఉండటంతో షాక్ అవ్వడం ప్రజల వంతవుతోంది. గతంలో ప్రజలు బియ్యంలో రాళ్లు కలవడం, బియ్యం క్వాలిటీగా లేకపోవడం లాంటి ఇబ్బందులు చూసే ఉంటాం. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఒక గ్రామంలో మాత్రం బియ్యంలో యూరియా కలిసింది. బియ్యం వేయించుకున్న ప్రజలు తినలేదు కాబట్టి సరిపోయింది కానీ తింటే పెద్ద ప్రమాదమే జరిగేది.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మర్కగూడ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో గిరిజన ప్రజలు నివశిస్తూ ఉంటారు. బియ్యంలో యూరియా రావడంతో గ్రామస్తులు రేషన్ డీలర్ ను ప్రశ్నించగా అతను తనకేం తెలీదని చెప్పాడు. దీంతో గ్రామస్థులు డీలర్ గురించి అధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, ఇతర అధికారులు పరిశీలించి నిజంగానే బియ్యంలో యూరియా కలిసిందని నిర్ధారించారు.

ఇలా కల్తీ ఘటనల్లో చాలావరకు అసలు దోషులు దొరకడం లేదు. దీంతో అధికారులకు సైతం కల్తీని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను కఠినంగా అమలు చేస్తే మాత్రమే కల్తీని నిరోధించడం.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...
Oktelugu Epaper
Exit mobile version