Homeహెల్త్‌Sleep Deprivation: నిద్రపోకుండా ఒక్కరాత్రి ఉన్నా.. ఎంత డేంజరో తెలుసా..

Sleep Deprivation: నిద్రపోకుండా ఒక్కరాత్రి ఉన్నా.. ఎంత డేంజరో తెలుసా..

Sleep Deprivation: ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం లేదా పని, మొబైల్, వినోదం కోసం నిద్రను త్యాగం చేయడం సాధారణంగా మారింది. అయితే ఒక్కో రోజు నిద్రకుండా ఉండి.. ‘ఒక్క రాత్రే కదా’ అని చాలామంది భావిస్తుంటారు. కానీ ఆ ఒక్క రాత్రి సరైన నిద్ర లేకపోయినా శరీరంలోని అనేక కీలక వ్యవస్థలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. శరీరం తనను తాను మరమ్మతు చేసుకునే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. అయితే ఒక్క రాత్రి కూడా నిద్ర లేకపోతే శరీరంలో ఎటువంటి మార్పులో వస్తాయో తెలుసా?

ఒక్క రాత్రి కూడా తగినంత నిద్ర లేకపోతే మొదటగా మెదడు పనితీరు మందగిస్తుంది. ఏకాగ్రత తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడం, జ్ఞాపకశక్తి బలహీనపడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, వాహనదారులపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే కోపం రావడం, చిరాకు పెరగడం, ఒత్తిడి అధికమవడం, ఆందోళన వంటి సమస్యలు కనిపిస్తాయి. కొంతమందిలో నిరాశ భావన కూడా పెరిగే అవకాశం ఉంటుంది. రోజువారీ పనుల్లో ఆసక్తి తగ్గిపోవడం కూడా సాధారణమే.

రాత్రి సరైన నిద్ర లేకపోతే జీర్ణక్రియ మందగిస్తుంది. గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు ఏర్పడి అధికంగా తినాలనే కోరిక పెరుగుతుంది. ముఖ్యంగా తీపి పదార్థాలు, జంక్ ఫుడ్ తినాలనే ఆసక్తి ఎక్కువవుతుంది. నిద్ర సమయంలో శరీరంలో అనేక హార్మోన్లు సమతుల్యంగా విడుదల అవుతాయి. కానీ నిద్ర తగ్గితే కార్టిసోల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. అలాగే ఆకలిని నియంత్రించే లెప్టిన్, గ్రెలిన్ హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీర్ఘకాలంలో మధుమేహం, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదం కూడా పెరుగుతుంది.

శరీరానికి అవసరమైన రోగనిరోధక వ్యవస్థ బలపడేందుకు నిద్ర కీలకం. ఒక్క రాత్రి నిద్రలేమి కూడా రోగనిరోధక కణాల పనితీరును తాత్కాలికంగా ప్రభావితం చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. దీంతో వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. నిద్ర సరిపోకపోతే రక్తపోటు తాత్కాలికంగా పెరగవచ్చు. గుండె వేగం మారడం, ఒత్తిడి హార్మోన్లు పెరగడం వంటి మార్పులు చోటుచేసుకుంటాయి. తరచూ నిద్రలేమి ఉంటే భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల ఏ ఒక్క రోజూ అనుకోకుండా ప్రతీరోజూ కంటినిండా నిద్రపోవాలి. వయోజనులు ప్రతి రోజు కనీసం 7 నుంచి 9 గంటల నాణ్యమైన నిద్ర పొందాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, యువతకు దీనికంటే ఎక్కువ నిద్ర అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, పడుకునే గంట ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గించడం, కెఫీన్ అధికంగా తీసుకోకపోవడం, ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోవడం ద్వారా మంచి నిద్ర పొందవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Most Popular

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Oktelugu Epaper
Exit mobile version