షుగర్ పేషెంట్స్ తీసుకునే ఆహారం విషయంలో తప్పనిసరిగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్ ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది. తీపి పదార్థాలతో పాటు కొన్ని ఆహార పదార్థాలకు దూరం కావడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అయితే షుగర్ పేషెంట్స్ పెరుగు తీసుకోవచ్చా..? పెరుగు తీసుకోకూడదా..? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది.
షుగర్ పేషెంట్స్ పెరుగు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. షుగర్ పేషెంట్స్ సలాడ్స్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆకుకూరలు, నారింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఫైటోన్యూట్రియెంట్స్, ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు లభించే అవకాశం ఉంటుంది.
షుగర్ పేషెంట్స్ ప్రతిరోజూ పండ్లతో పాటు పిండి పదార్థాలను స్నాక్స్ గా తీసుకుంటే మంచిది. ఎలక్ట్రోలైట్స్, ఫైబర్ ను తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ ఆహారం విషయంలో మార్పులు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.