Homeఅంతర్జాతీయంHormuz Strait Tensions Impact On India LPG Supply: భారత్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇక...

Hormuz Strait Tensions Impact On India LPG Supply: భారత్‌కు గుడ్‌ న్యూస్‌.. ఇక గ్యాస్‌ కష్టాలు తీరినట్లే!

Hormuz Strait Tensions Impact On India LPG Supply: భారతీయుల గ్యాస్‌ కష్టాలు తీరబోతున్నాయి. ప్రపంచ ఇంధన వాహక మార్గాల్లో కీలకమైన హార్ముజ్‌ జలసంధి ఘర్షణల మధ్య, భారత నౌకాదల శివాలిక్‌ విజయవంతంగా అడ్డంకులను అధిగమించింది. మరికొన్ని గంటల్లో గుజరాత్‌ ముంద్రా పోర్టుకు చేరుకోనుంది. ఈ నౌకలో 40–46 వేల మెట్రిక్‌ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్‌ (ఎల్‌పీజీ) లోడ్‌ ఉంది. ఈ సరఫరా దేశవ్యాప్త గృహ ఇంధన కొరతలను తగ్గిస్తుంది. చిరు పొట్టి వ్యాపారాలకు గ్యాస్‌ సరఫరా పెంచుతుంది.

ఇప్పటికే చేరుకున్న ‘నందా దేవి’..
ఇదిలా ఉంటే మరో నౌక నందాదేవి 46 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్‌పీజీతో భారతకు చేరుకుంది. భారత నావికాదలం పూర్తి ఎస్కార్ట్‌ అందించింది. జలాంతర్గల ప్రమాదాలను నివారిస్తోంది. ఈ రెండు లోడ్‌లు కలిపి 90 వేల టన్నులు ఎల్‌పీజీ తీసుకువస్తున్నాయి. తక్షణ కొరతలను పూర్తిగా తీర్చే అవకాశం ఉంది. ఇది భారత్‌ జల మార్గాల్లో సాంకేతిక, భద్రతా సామర్థ్యానికి నిదర్శనం.

హార్ముజ్‌ జలసంధి ప్రాముఖ్యత
పపంచంలో 20% క్రూడ్‌ ఆయిల్, 25% ఎల్‌పీజీ ఎగుమతులు
హార్ముజ్‌ జలసంధి గుండా రవాణా అవుతుంది. ఇటీవల మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు (ఇరాన్‌–ఇజ్రాయిల్‌ ఘర్షణలు) ఈ మార్గాన్ని అడ్డుకుని, భారతదేశంలోఎల్‌పీజీ సరఫరా 15–20% తగ్గింది. ఫలితంగా, దశలవారీగా ధరలు పెరిగి, గ్రామీణ ప్రాంతాల్లో సిలిండర్లు అందుబాటులో లేకపోయాయి. భారత్‌ ఏటా 27 మిలియన్‌ టన్నుల ఎల్‌పీజీ వినియోగిస్తోంది. దీనిలో 50% దిగుతులపైనే ఆధాపడింది.

ఆర్థిక, సామాజిక ప్రభావాలు..
ఎల్‌పీజీ రాక బహుముఖ ప్రయోజనాలు కలిగిస్తుంది. 30 కోట్ల మంది గృహాల్లో ప్రధాన మంత్రి ఉజ్జ్వలా యోజన కవరేజ్‌తో కూడిన కుటుంబాలు ప్రయోజనం పొందుతారు. ధరలు 5 నుంచి 8 శాతం తగ్గే అవకాశం ఉంది. ఫర్టిలైజర్, పెట్రోకెమికల్స్‌ ఉత్పత్తుల్లో ఖర్చు తగ్గి, వ్యవసాయ ఎరువులు, ప్లాస్టిక్‌ ధరలు స్థిరంగా ఉంటాయి. ద్రవ్యోల్బణం 1 శాతం తగ్గే అవకాశం ఉంది.

తాత్కాలిక పరిష్కారాలతోపాటు, భారత్‌ దీర్ఘకాల వ్యూహాలు రూపొందిస్తోంది. మెగాలోగా–ముంద్రా వంటి ప్రాజెక్టులు 2027 నాటికి 10 మిలియన్‌ టన్నులు సామర్థ్యం పెంచుతాయి. దాద్రా, జైపూర్‌లో కొత్త యూనిట్లు రష్యా, అమెరికా నుంచి డైవర్సిఫైడ్‌ సోర్సెస్‌. బయోగ్యాస్‌ ప్లాంట్లు 5 మిలియన్‌ టన్నులు ఏటా జోడిస్తాయి.
ఈ చర్యలు హార్ముజ్‌పై ఆధారాన్ని 30 శాతం తగ్గిస్తుంది. జాతీయ శక్తి భద్రతను బలోపేతం చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version