Homeహెల్త్‌Health Alert: సమోసా, వడపావ్, జిలేబీ లు తింటున్నారా?

Health Alert: సమోసా, వడపావ్, జిలేబీ లు తింటున్నారా?

Health Alert: సమోసా, వడ పావ్, జిలేబీ, గులాబ్ జామూన్ ల పేరు వింటే చాలు ఎంత నోరు ఊరుతుంది కదా. ఇవంటే చాలా మందికి ఇష్టం. కనిపిస్తే నోరూ ఊరడమే కాదు గుటుక్కుమన మింగేస్తారు చాలా మంది. కానీ మీరు కూడా ఇలాగే తింటే ఓ హెల్త్ వార్నింగ్ వచ్చింది. దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఈ హెచ్చరిక మీ ఆరోగ్యం మీ చేతులోనే ఉంటుందని తెలుపుతుంది. చాలా మందికి కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే సమోసాలు, జిలేబీలు, గులాబ్ జామున్లు, వడ పావ్‌లు… సిగరెట్‌ల మాదిరిగా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయట. అంతేకాదు వీటి వల్ల జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖ.

Also Read: ఏపీకి అవార్డుల పంట.. హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు అరుదైన గుర్తింపు

ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాగ్‌పూర్‌లోని ఎయిమ్స్‌తో సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలను కొన్ని ఆదేశాలను జారీ చేసింది. రోజు ఇండియన్స్ తినే స్నాక్స్‌లో దాగి ఉన్న కొవ్వు, చక్కెర కంటెంట్‌ను బహిర్గతం చేసే ఆకర్షణీయమైన “ఆయిల్ అండ్ షుగర్ బోర్డులను” ఏర్పాటు చేయాలని సూచించింది. అంతేకాదు ఈ స్పష్టమైన, విద్యా పోస్టర్లు త్వరలో కేఫ్టీరియాలు, ప్రభుత్వ సంస్థల సాధారణ ప్రాంతాలలో తప్పనిసరి అవుతాయట. అధిక చక్కెర – ట్రాన్స్ ఫ్యాట్ ఉపయోగిస్తే ఎంత నష్టం వస్తుందో ప్రజలకు నిశ్శబ్దంగా గుర్తు చేస్తాయి. అంతేకాదు వీటి గురించి అవగాహన కలిగిస్తాయి.

ఈ సమాచార ఉద్దేశ్యం ఆహారాన్ని నిషేధించడం కాదు. కేవలం సమాచారం ఇవ్వడం. ఐదు టీస్పూన్ల చక్కెర ఉన్న లడ్డూ? గులాబ్ జామూన్ దాదాపు ఒకేలా ఉంటుందా? అనే ప్రశ్న మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే మీరు రెండవ సహాయాన్ని పొందే ముందు ప్రభుత్వం మీకు తెలుపుతుంది అన్నమాట. చక్కెర – ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి కొత్త పొగాకు అని కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియాకు చెందిన అమర్ అమలే తెలిపారు. ప్రజలు ఏం తింటున్నారో వారికి తెలియడం చాలా అవసరం.

భారతదేశం ఒక పెద్ద ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అనేది వాస్తవం. 2050 నాటికి 44.9 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధ పడతారు అని చెబుతున్నాయి సర్వేలు. దీని వల్ల మన దేశం ఊబకాయ సూచికలో అమెరికా తర్వాత రెండవ స్థానంలో ఉంది. పట్టణంలో ఉన్న వారిలో అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు ఇప్పటికే అధిక బరువుతో బాధ పడుతున్నారు. సరైన ఆహారం లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా బాల్యంలో ఊబకాయం పెరుగుతోంది.
ఇవన్నీ సమస్యలు కూడా భారతదేశంలో నూనె, చక్కెర వంటకాల పట్ల ఉన్న ఇష్టం వల్లే వస్తున్నాయి అంటున్నారు నిపుణులు. ఇది సాంప్రదాయ ఆహారంపై అణిచివేత కాదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఆయిల్ వినియోగం కాస్తైనా తగ్గాలి. అంటే 10% తగ్గింపును అయినా ప్రోత్సహించాలి అంటున్నారు నిపుణులు.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular