Water Benefits : ప్రతి రోజు ఉదయం లేవగానే మంచినీళ్లు తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఉదయం పూట మనం తాగే నీళ్లు మనకు మందులా పనిచేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కణాలను బయటకు పంపడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే లీటర్ పావు నీళ్లు తాగడం వల్ల మన దేహం మంచి ఉత్సాహంతో ఉంటుంది. మనిషికి నీరే ఆధారం. మన ఒంట్లో కూడా తొంభై శాతం నీరే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. మన శరీరం నీళ్లతోనే నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరు నీరు తాగడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందే.
రాత్రి సమయంలో మనం నిద్రిస్తుంటాం. ఆ సమయంలో ఏమి తీసుకోం. దీంతో ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను బయటకు పంపడంలో నీళ్లు సాయపడతాయి. రక్తంలో ఉండే వ్యర్థాలను మూత్రం రూపంలో తొలగించడంలో కీలక పాత్ర వహిస్తుంది. దీంతోనే ఉదయం లేవగానే నీళ్లు తాగడం మంచిదే.
నిద్ర నుంచి లేవగానే నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. అల్పాహారం చేయడానికి ఓ అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగితే కేలరీలు తగ్గించడానికి దోహదపడుతుంది. ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటు వ్యాధులు రాకుండా పోతాయి. ఇలా చేయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి దూరం అవుతుంది. శరీరంలోని అంతర్గత అవయవాల పనితీరులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. పరగడుపున గోరు వెచ్చని నీరు తాగితే రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. తక్షణమే శక్తి లభిస్తుంది.
ఇలా మంచినీళ్లు తాగే విషయంలో అశ్రద్ధ పనికి రాదు. ఎందుకంటే ఉదయం పూట మనం తాగే నీళ్లే మన ఆరోగ్యానికి మెట్లుగా పనిచేస్తాయి. అందుకే ఉదయం సమయంలో నీళ్లు తాగడం అలవాటుగా చేసుకోవాలి. దీని వల్ల మన శరీరం మంచి లాభాలు పొందుతుంది. ఒంట్లో ఉండే రోగాలు చాలా వరకు దూరమవుతాయి. ఈ నేపథ్యంలో మంచినీళ్ల విలువ తెలుసుకుని తాగితే మనకే ప్రయోజనం. తాగకపోతే కూడా మనకే నష్టాలు ఉంటాయి. ఈ విషయం తెలుసుకుని మసలుకుంటే మంచిది.