Homeకరోనా వైరస్ఆ ఐఐటీలో 66 మంది విద్యార్థులకు కరోనా.. చివరకు..?

ఆ ఐఐటీలో 66 మంది విద్యార్థులకు కరోనా.. చివరకు..?

కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి పలు రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. విద్యాసంస్థలు ఓపెన్ కావడంతో విద్యార్థులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటంతో పలు రాష్ట్రాల్లో అధికారులు కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నారు. ఐఐటీ చెన్నైలో కరోనా మహమ్మారి విజృంభించింది.

ఒకవైపు త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో కరోనా వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. చెన్నై ఐఐటీలో ఏకంగా 66 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. మొత్తం 71 మందికి కరోనా నిర్ధారణ కాగా అందులో 66 మంది విద్యార్థులు మిగిలిన వాళ్లు సిబ్బంది కావడం గమనార్హం.

స్వయంగా ఐఐటీ అధికారులే విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడినట్లు ప్రకటన చేశారు. మొత్తం యూనివర్సిటీలో 774 మంది విద్యార్థులు ఉన్నారు. ఏకంగా 71 మందికి కరోనా నిర్ధారణ అవడంతో ఆ క్యాంపస్ అంతటా లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్నాయి. అధికారులు విద్యార్థులు, సిబ్బంది హాస్టల్ గదులకే పరిమితం కావాలని.. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచనలు చేశారు.

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అధ్యాపకులు, ఇతర ఉద్యోగులు క్యాంపస్ లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇంటినుంచి పని చేయనున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...

Tollywood Directors: బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశ్యం లేని తెలుగు దర్శకులు వీళ్లే…

Tollywood Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు కొందరు తెలుగు హీరోలు అవకాశం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా వంశీ పైడిపల్లి తెలుగు స్టార్...

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
Oktelugu Epaper
Exit mobile version