spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu vs Achchenna Yoga: అచ్చెన్న.. నువ్వు యోగాకు రాకపోతేనే బెటర్.. బాబు సెటైర్లు.. వైరల్...

Chandrababu vs Achchenna Yoga: అచ్చెన్న.. నువ్వు యోగాకు రాకపోతేనే బెటర్.. బాబు సెటైర్లు.. వైరల్ వీడియో

Chandrababu vs Achchenna Yoga: విశాఖలో( Visakhapatnam) ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొని ఉన్నారు. ఈనెల 21న యోగా దినోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం షెడ్యూల్ ప్రకటించింది. ఈనెల 20న భువనేశ్వర్ నుంచి విశాఖకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు. అక్కడ రాత్రి బస చేసి.. ఉదయం యోగా దినోత్సవం లో పాల్గొనున్నారు. దాదాపు 5 లక్షల మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ క్రమంలో మంత్రులతో సమావేశం నిర్వహించారు. అయితే సీనియర్ మంత్రిగా ఉన్న అచ్చెనాయుడు ఓ అంశంపై మాట్లాడుతుండగా.. సెటైర్లు వేశారు చంద్రబాబు. ఏకంగా యోగా డేకు రావద్దని మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే వైరల్ అవుతున్నాయి.

మంత్రులతో సమీక్ష
విశాఖ యోగా దినోత్సవానికి( yoga day ) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అధికారులతో పాటు మంత్రులతో సమీక్ష జరిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా బస్సుల్లో యోగాభ్యాసకులను ఎలా తీసుకురావాలి? వారికి కేటాయించిన సీట్లలో ఎలా కూర్చోబెట్టాలి? బస్సులు ఎన్ని అవసరం అవుతాయి? వంటి విషయాల మీద చంద్రబాబు చర్చించారు. ఇంతలో మంత్రి అచ్చెనాయుడు జోక్యం చేసుకున్నారు. ఏయే బస్సుల్లో ఎవరు ఎక్కుతారు? అనేసరికి చంద్రబాబు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఏ బస్సులో ఎవరు ఎక్కడం ఏంటి అని ప్రశ్నించారు. ఎవరు పడితే వారు ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రతిష్టాత్మకమైన యోగా డేకు ఎలా వస్తారని నిలదీసినంత పని చేశారు చంద్రబాబు. నెలరోజులపాటు సచివాలయం కేంద్రంగా యోగభ్యాసకులకు ప్రాక్టీస్ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. అటువంటి వారే వస్తారని.. వారందరికీ ప్రత్యేకంగా నెంబర్ ఇస్తారని.. వారికి కేటాయించిన చోటులో మాత్రమే వారు కూర్చోవాలని.. ఏ ప్రాక్టీస్ చేయకుండా నేరుగా బస్సులు ఎక్కి వస్తామంటే కుదరని పనిగా తేల్చేశారు.

Also Read: Chandrababu : చంద్రబాబు కొత్త రికార్డు!

వరుసగా సెటైర్లు..
మరోవైపు మంత్రి అచ్చెనాయుడు పై( Minister Achan Naidu ) సెటైర్లు పేల్చారు చంద్రబాబు. ఈ విషయాల మీద అవగాహన లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. నీవు కూడా యోగ ప్రాక్టీస్ చేయకపోతే దయచేసి రావొద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. యోగా డేనాడు తలో రకం చేస్తే అది వార్తల్లో ప్రధాన అంశంగా మారిపోతుందని… మొత్తానికి ఎసరు వస్తుందని అన్నారు చంద్రబాబు. అక్కడ ఒక క్రమ పద్ధతి ప్రకారం జరగాలని చంద్రబాబు గుర్తు చేశారు. యోగ ప్రాక్టీస్ లేకపోతే అచ్చెన్న నీవు రావద్దు అని చంద్రబాబు అనేసరికి అక్కడ నవ్వులు విరిశాయి. అయితే చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్ తో ఇప్పుడు అందరి దృష్టి అచ్చెన్న పై ఉంటుంది. యోగా డే నాడు కచ్చితంగా మీడియా ఫోకస్ సైతం ఆయన పైనే ఉంటుంది. మరి ఆయన ఆరోజు యోగా దినోత్సవానికి వస్తారో? లేదో? చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Chiranjeevi: చిరంజీవి లో మంచి రైటర్ ఉన్నాడా… ఆయన రాసిన కథ తో సినిమా…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న చిరంజీవి ఈ మధ్యకాలంలో చేసిన...

Nagarjuna: ది ఒడిస్సీ ని చూసి నేర్చుకోవాలి…డైరెక్టర్లు, హీరోల మీద ఫైర్ అయిన నాగార్జున… వైరల్ వీడియో…

Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని...

Talliki Vandanam Scheme 2026: తల్లికి వందనం.. రూ.13 వేలు జమ.. చెక్ చేసుకోండి!

Talliki Vandanam Scheme 2026: ఏపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మక పథకానికి సంబంధించి నిధులు జమ చేయనుంది. పాఠశాలతో పాటు ఇంటర్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద చదువుకు సాయం అందించనుంది....

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Oktelugu Epaper
Exit mobile version