Homeఆంధ్రప్రదేశ్‌21 Visakhapatnam Yoga Event: విశాఖపై అంతర్జాతీయ ముద్ర.. మోదీ ప్రాధాన్యం వెనుక!

21 Visakhapatnam Yoga Event: విశాఖపై అంతర్జాతీయ ముద్ర.. మోదీ ప్రాధాన్యం వెనుక!

21 Visakhapatnam Yoga Event: అంతర్జాతీయ స్థాయిలో( International) మరోసారి విశాఖపట్నం మార్మోగ నుంది. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విశాఖలో జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐదు లక్షల మందితో యోగా దినోత్సవ వేడుకలు జరిపేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటికే విశాఖ సిటీ పర్యాటకంగా గుర్తింపు పొందింది. వాణిజ్యపరంగా అభివృద్ధి సాధిస్తోంది. ఆసియా ఖండంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మెగాసిటీగా గుర్తింపు సాధించింది. అందుకే సిటీ ఆఫ్ డెస్టినీ గా పేర్కొంటారు. ఇక టూరిజం అంటే విశాఖ అని అంతర్జాతీయ పర్యాటకులు భావిస్తారు. అటువంటి చోట ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు జరుపుతుండడంతో.. మరోసారి అంతర్జాతీయ స్థాయిలో విశాఖ చర్చకు దారితీస్తోంది.

Also Read: PM Modi Vizag Yoga Day: ఏపీకి ప్రధాని మోదీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

యోగాతో అంతర్జాతీయ ఖ్యాతి
యోగాకు( yoga) ప్రపంచ గుర్తింపు తీసుకొచ్చింది భారత్. అందుకే యోగా విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి విశాఖలో జరిగే వేడుకలకు హాజరవుతానని ముందుగానే ప్రకటించారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేసిన మోడీ.. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సాగర తీరానికి వస్తానని రాష్ట్ర ప్రభుత్వానికి ఆఫర్ ఇచ్చారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే విశాఖ అభివృద్ధికి అడుగులు పడినట్టే. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థలు విశాఖకు క్యూ కడుతున్నాయి. ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్నాయి. ఆర్థిక రాజధానిగా విశాఖ మారుతున్న క్రమంలో ఇటువంటి అంతర్జాతీయ వేడుకలకు వేదికగా నిలవడం శుభపరిణామం.

షెడ్యూల్ ప్రకటన
ప్రధాని విశాఖ పర్యటనకు( Visakha tour) సంబంధించి షెడ్యూల్ ముందుగానే ఖరారు అయింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. ఈనెల 20న ప్రధాని నరేంద్ర మోడీ భువనేశ్వర్ నుంచి విశాఖకు చేరుకోనున్నారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. ఆ తరువాత రోజు ఉదయం 6:30 గంటలకు విశాఖ బీచ్ రోడ్ లో యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనున్నారు. అదేరోజు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

Also Read: Visakhapatnam : విశాఖలో ఐదు లక్షల మందితో యోగా ఈవెంట్!

ప్రముఖుల తాకిడి
ప్రధాని మోదీ ( Prime Minister Narendra Modi)పర్యటన నేపథ్యంలో విశాఖకు ప్రముఖుల తాకిడి పెరిగింది. ఇప్పటికే ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఆయన ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకనున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ నేరుగా విశాఖకు చేరుకుంటారు. కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతారు. ఒకరోజు ముందుగానే విశాఖ నగరం భద్రత వలయంలోకి వెళ్తుంది. ఇప్పటికే నగరం నిఘా నీడలో ఉంది. మొత్తానికైతే విశాఖకు అంతర్జాతీయ ఖ్యాతి రావడం పై నగరవాసులతోపాటు ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Oktelugu Epaper
Exit mobile version