రాజశేఖర్ కూతురుతో జతకట్టిన యంగ్ హీరో

జాంబిరెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో తేజ సజ్జ. అంతకుముందు బాలనటుడిగా ఎంతో ఫేమస్ అయిన ఈ బుడ్డోడు ఇప్పుడు హీరోగానూ సత్తాచాటుతున్నాడు. ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు. ఇటీవలే ‘హనుమాన్’ అంటూ మరో సినిమాను తేజ అనౌన్స్ చేశాడు. ‘జాంబిరెడ్డి’కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదో అద్భుత చారిత్రక చిత్రమని చెబుతున్నారు. తాజాగా హనుమాన్ లైన్లో ఉండగానే హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీతో […]

Written By: NARESH, Updated On : July 1, 2021 5:20 pm
Follow us on

జాంబిరెడ్డి సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు హీరో తేజ సజ్జ. అంతకుముందు బాలనటుడిగా ఎంతో ఫేమస్ అయిన ఈ బుడ్డోడు ఇప్పుడు హీరోగానూ సత్తాచాటుతున్నాడు. ఓ బేబి, జాంబిరెడ్డి సినిమాలతో వరుస హిట్స్ అందుకున్నాడు.

ఇటీవలే ‘హనుమాన్’ అంటూ మరో సినిమాను తేజ అనౌన్స్ చేశాడు. ‘జాంబిరెడ్డి’కి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మనే ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదో అద్భుత చారిత్రక చిత్రమని చెబుతున్నారు.

తాజాగా హనుమాన్ లైన్లో ఉండగానే హీరో రాజశేఖర్ పెద్ద కూతురు శివానీతో జతకట్టాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశాడు. శివానీ, తేజ సజ్జూ హీరోహీరోయిన్లుగా ‘అద్భుతం’ పేరుతో సినిమాను అనౌన్స్ చేశారు. పోస్టర్ వినూత్నంగా.. ఆసక్తికరంగా ఉంది.

హీరో తేజ, హీరోయిన్ శివానీ కుర్చీపై కూర్చుండి వెనుకాల అద్భుతమైన అస్తమిస్తున్న సూర్యుడి ప్రకాశాన్ని చాలా బాగా డిజైన్ చేసి ఈ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కథ వేర్వేరు కాలాలకు సంబంధించినది అని అంటున్నారు.

‘అద్భుతం’ సినిమా కేవలం ప్రేమకథ కాదని.. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్ కలిగి ఉందని చెబుతున్నారు.అద్భుతం చిత్రానికి ‘జాంబిరెడ్డి’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందిస్తుండగా.. మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.