అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భారత్ లో పసిడి ధర పెరిగింది. గురువారం నాటి బులియన్ ట్రేడింగ్ లో ధేశ రాజధాని దిల్లీలో రూ. 10 గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 526 పెరిగి రూ. 46,310కి చేరింది. రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమైందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 45,784 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.