పవన్ ను వెంటాడుతున్న‘అజ్ఞాతవాసి’.. ఇప్పుడెలా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిపోయారు. పవన్ చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు ఉన్నాయి. వచ్చే రెండు మూడేళ్లకు పవన్ డేట్స్ ముందుగానే బుక్కయ్యాయి. పవన్ వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతోన్నారు. Also Read: బిగ్ బాస్ లో దొంగ ఓటింగ్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తుందన్నారు. ఈ సినిమా ఇప్పటికే 80శాతం […]

Written By: NARESH, Updated On : October 27, 2020 2:40 pm
Follow us on


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఫుల్ బీజీగా మారిపోయారు. పవన్ చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు ఉన్నాయి. వచ్చే రెండు మూడేళ్లకు పవన్ డేట్స్ ముందుగానే బుక్కయ్యాయి. పవన్ వరుస సినిమాలు చేస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుండటంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతోన్నారు.

Also Read: బిగ్ బాస్ లో దొంగ ఓటింగ్

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ మూవీ చేస్తుందన్నారు. ఈ సినిమా ఇప్పటికే 80శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు దిల్ రాజు.. బోనికపూర్ సన్నహాలు చేస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే తిరిగి షూటింగ్ ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన షూటింగులో పవన్ సైతం షూటింగులో పాల్గొన్నారనే టాక్ విన్పించింది.

పవన్ కల్యాణ్ ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో.. ఆ తర్వాత హరీష్ శంకర్ తెరకెక్కించే సినిమాలో నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ నటించే మూవీ ‘అయ్యప్పనుం కోషీయం’ రీమేక్ మూవీ అని ప్రచారం జరుగుతోంది. దసరా సందర్భంగా ఈ మూవీని పవన్ కల్యాణ్ తో చేయబోతున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది.

మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ తోపాటు దగ్గుపాటి రానా నటించబోతున్నాడు. మల్టిస్టారర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వం వహించనున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్  ఇప్పటి వరకు కేవలం మిడిల్ బడ్జెట్ సినిమాలను మాత్రమే తీయగా పవన్ కల్యాణ్ తో సినిమాను ప్రకటించడం ఆసక్తిని రేపుతోంది.

Also Read: నమ్మక ద్రోహం చేసిన మాస్టర్

ఈ బ్యానర్లో రీసెంట్ గా బాబు బంగారం.. జెర్సీ.. భీష్మ లాంటి మూవీలు వచ్చాయి. సితార బ్యానర్ కూడా హారిక హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్.రాధాక‌ృష్ణదే. హరిక హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్ సినిమాలు తీస్తుండగా సితార బ్యానర్ మిడిల్ బడ్జెట్లో సినిమాలు తీస్తున్నాయి. పవన్ తో సినిమా అంటే నిజానికి హారిక హాసిని క్రియేషన్స్ లో సినిమా రావాల్సి ఉంది.

ఐతే హారిక హాసిని బేనర్లో పవన్ చేసిన ‘అజ్ఞాతవాసి’ దారుణమైన ఫలితాన్నిచవిచూసింది. దీంతోనే పవన్ కల్యాణ్ గానీ.. రాధాకృష్ణగానీ ఈ బ్యానర్లో సినిమా చేయడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతోనే ‘సితార’లో పవన్ కొత్త సినిమా రాబోతుందని టాక్ ఫిల్మ్ నగర్లో విన్పిస్తోంది. ఏదిఏమైనా పవన్ నుంచి మరో కొత్త సినిమా అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.