Nagarjuna: కొండ సురేఖ వల్ల ఎవరికి నష్టం జరుగబోతుంది… నాగార్జున ఎందుకంత సిరియస్ అవుతున్నారు…

సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలా మంది నటులు ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నారు. ఇక మొత్తానికైతే ప్రతి ఒక్కరు స్టార్ హీరోలుగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు...ఇక ఇలాంటి సమయం లోనే కొందరి లైఫ్ అనుకోకుండ అతలకుతలం అవుతుంది...

Written By: Gopi, Updated On : October 4, 2024 5:03 pm

Nagarjuna(10)

Follow us on

Nagarjuna: సెలబ్రిటీ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదైనా పనిచేసిన లేదా ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు అయిన చాలా జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇతరులను దూషించినప్పుడు వాళ్ళు ఆటోమేటిగ్గా ప్రేక్షకుల్లో బ్యాడ్ అయిపోతుంటారు. అందువల్లే ప్రతి ఒక్కరి విషయంలో ఎదుటివారు ఏ ప్రశ్నలను అడుగుతున్నారు వాటికి మనం. ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఆలోచిస్తూ ముందుకు సాగాలి. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా బాధ్యతలను కొనసాగిస్తున్న కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ మీద చేసిన కొన్ని ఆరోపణలతో ఆమె చాలా వివాదాలను ఎదుర్కొంది. అయినప్పటికీ తను దిగివచ్చి సారీ చెప్పింది. అయినా కూడా అక్కినేని ఫ్యామిలీ ఆమె మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక ఈ విషయం మీద నాగార్జున కోర్టులో పరువు నష్టం దావా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక రీసెంట్ గా అక్కినేని అఖిల్ కూడా కొండ సురేఖ ను వదిలి పెట్టేది లేదనే రేంజ్ లో ఒక పోస్ట్ అయితే చేశాడు.

ఇక దీనికి కొండా సురేఖ సారీ చెప్పినా కూడా విడిచిపెట్టకపోతే నేను బాధ్యురాలని కాదు అంటూ ఆమె సమాధానం చెబుతూనే నాగ చైతన్య సమంత ఎలా విడిపోయారు అనేది వాళ్ళు బయటకు వచ్చి టీవీ ముందు ఎక్కడ చెప్పుకోలేదు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో గాని బయట జనాల మధ్య నానుతున్న ఒక విషయాన్ని నేను మీడియా ముందు చెప్పాను. అందులో ఏం మాత్రం తప్పుందో నాకు అర్థం కావడం లేదు.

ఒకవేళ తప్పు ఉంటే సారీ అని చెప్పినప్పటికీ ఎవరికి వాళ్లు చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు అంటూ ఆమె కొన్ని మాటలు అయితే మాట్లాడింది. మరి మొత్తానికైతే ఇదంతా చూస్తుంటే కావాలనే కాంగ్రెస్ పార్టీలోని పెద్ద నేతలు నాగార్జునను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకు అంటే నాగార్జున ఇంతకుముందు వైసీపీ పార్టీకి చాలా ఫేవర్ గా ఉండేవాడు. తెలంగాణలో అయితే బి ఆర్ ఎస్ పార్టీకి ఫేవర్ గా ఉన్నాడు. కాబట్టి అతని మీద కొన్ని కుట్రలు కూడా జరుగుతున్నాయంటు కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి…

ఇక ఈ కేసు మీద నాగార్జున లీగల్ గా ప్రోసిడ్ అవుతుంటే కొండా సురేఖ కూడా ఏ మాత్రం భయపడకుండా మీకు నచ్చింది చేసుకోండి అంటూ ఆమె క్లారిటీ ఇస్తున్నారు. మరి మొత్తానికైతే దీనివల్ల ఇటు కొండా సురేఖ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా? లేదంటే నాగార్జునకు నష్టం జరుగుతుందా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…