విద్యా బాలన్ మళ్ళీ అందాల అరబోతకు సై !

క్లాసిక్ అండ్ కూల్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అంటేనే ఫీల్ గుడ్ అండ్ మెసేజ్ ఎంటర్ టైనర్.. అన్నిటికిమించి మణిరత్నం సినిమా అంటే ఒక బ్రాండ్.. పైగా ఆయనొక క్రియేటివ్ డైరెక్టర్. ఇక మణి ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా పూర్తయ్యేది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ఫేవరేట్ బబ్లీ బ్యూటీ విద్యా బాలన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోందని.. కోలీవుడ్ మీడియాలో […]

Written By: Neelambaram, Updated On : July 24, 2020 10:06 pm
Follow us on

క్లాసిక్ అండ్ కూల్ డైరెక్టర్ మణిరత్నం సినిమా అంటేనే ఫీల్ గుడ్ అండ్ మెసేజ్ ఎంటర్ టైనర్.. అన్నిటికిమించి మణిరత్నం సినిమా అంటే ఒక బ్రాండ్.. పైగా ఆయనొక క్రియేటివ్ డైరెక్టర్. ఇక మణి ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. కరోనా లేకపోయి ఉంటే.. ఈ పాటికి ఈ సినిమా పూర్తయ్యేది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ ఫేవరేట్ బబ్లీ బ్యూటీ విద్యా బాలన్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తోందని.. కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా అనంతరం జరగబోయే షూట్ లో విద్యా బాలన్ కూడా పాల్గొనబోతుందని తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విద్యా బాలన్ ద్విపాత్రాభినయం చేయనుందట.

Also Read: ఆ లేడీ డైరెక్టర్ ఫుల్ బోల్డ్ గా తీసిందట !

వాటిలో ఒక పాత్ర నెగెటివ్ షేడ్స్ ఉన్న నందిని పాత్ర కాగా మరో పాత్ర ఆమె తల్లి పాత్ర మందాకినీ దేవి పాత్ర అని, సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్రలుగా ఉండే ఈ పాత్రల కోసం విద్యా బాలన్ బరువు కూడా తగ్గబోతుందని తెలుస్తోంది. అయితే విద్యా పాత్రకు సినిమాలో ఎక్కడా డైలాగ్స్ ఉండవని మొత్తానికి విద్యా బాలన్ రోల్ బాగా ఎగ్జైటింగా ఉండబోతుందని తెలుస్తోంది. పైగా నందిని పాత్ర వెరీ బోల్డ్ గా ఉంటుందని, ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో అందాల అరబోతలో హద్దులు దాటేలా సీన్స్ ఉండబోతున్నాయని రూమర్స్ వినిపిస్తున్నాయి.

Also Read: ఫ్యామిలీలో అందరి కళ్లూ నా మీదే పడ్డాయి: సాయి ధరమ్‌

పైగా ఆ బోల్డ్ సన్నివేశాల్లో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేయడానికి విద్యా బాలన్ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అందుకు తగ్గట్లుగానే బాడీ కూడా తగ్గిస్తుందట. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి ఆర్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తి, విజయ్ సేతుపతి, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలతో పాటు.. త్రిష, అమలాపాల్, ఐశ్వర్య లక్ష్మి లాంటి టాలెంటెడ్ నటీమణులు కూడా నటిస్తున్నారు. ఏమైనా మణిరత్నం చాలా సంవత్సరాలు తరువాత ఎంతో ఆసక్తిగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.