ఆ లేడీ డైరెక్టర్ ఫుల్ బోల్డ్ గా తీసిందట !

డైరెక్షన్ కే లైఫ్ ను డెడికేట్ చేసిన లేడి డైరెక్టర్ నందినిరెడ్డి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కి పని చేస్తోంది. హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ అనే బోల్డ్ సిరీస్ ని తెలుగులోకి తీసుకువస్తున్నారు. నాలుగు కథలు ఉన్న ఈ సిరీస్ లో ఒక కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. లస్ట్ స్టోరీస్ లో మధ్య వయసులో ఎఫైర్ పెట్టుకున్న లేడీ కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూటింగ్ […]

Written By: Neelambaram, Updated On : July 24, 2020 10:07 pm
Follow us on

డైరెక్షన్ కే లైఫ్ ను డెడికేట్ చేసిన లేడి డైరెక్టర్ నందినిరెడ్డి ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కి పని చేస్తోంది. హిందీలో వచ్చిన లస్ట్ స్టోరీస్ అనే బోల్డ్ సిరీస్ ని తెలుగులోకి తీసుకువస్తున్నారు. నాలుగు కథలు ఉన్న ఈ సిరీస్ లో ఒక కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేసింది. లస్ట్ స్టోరీస్ లో మధ్య వయసులో ఎఫైర్ పెట్టుకున్న లేడీ కథను నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది. ఇప్పటికే ఆ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవ్వడంతో పాటు తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. ఫస్ట్ కాపీ కూడా చూసుకుని అవుట్ ఫుట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నారట మేకర్స్. కాకపోతే ఎపిసోడ్ లో కాస్త ఘాటు సీన్స్ ఉన్నాయని… కథకు అనుగుణంగానే బోల్డ్ సీన్స్ సాగిన, వాటిని నందిని రెడ్డి ఏ మాత్రం మొహమాట పడకుండా అంతే బోల్డ్ గా తీసిందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

Also Read: కరోనా దెబ్బకు అవతార్2 ఏడాది ఆలస్యం

ఒక లేడీ డైరెక్టర్ అలాంటి బోల్డ్ కంటెంట్ తీసుకుని అంతే బోల్డ్ గా తియ్యడం అంటే.. ఎంతో డేర్ ఉండాలి. పైగా ఒక సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత ఇలాంటి వెబ్ సిరీస్ తీయాలనుకోవడం నిజంగా రిస్క్. కానీ నందిని రెడ్డి చేసి చూపించింది. ఇక నందిని డైరెక్షన్ లో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో వచ్చిన ‘ఓ బేబీ’ సినిమా ఆల్ సెంటర్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధించింది. పైగా గతాడేది సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా సూపర్ హిట్ సినిమాగా నిలవడం విశేషం. దాంతో నందిని రెడ్డి తరువాత సినిమా పై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి ఉన్న సమయంలో ఒక బోల్డ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: ట్రాక్ తప్పిన చైతు.. గైడ్ చేయనున్న నాగ్ !

మరి ఈ సిరీస్ తేడా కొట్టినా.. మరీ హద్దులు దాటారని టాక్ వచ్చినా.. కచ్చితంగా నందిని రెడ్డి తరువాత సినిమా పై బాగానే ఎఫెక్ట్ పడుతుంది.అన్నట్టు నందిని రెడ్డి ‘ఓ బేబీ’ చిత్రీకరణ సమయంలోనే స్వప్న సినిమాస్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయడానికి సైన్ చేసింది. ఈ సినిమాని ప్రియాంక దత్ నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాకి లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తుండగా నాని హీరోగా నటించే అవకాశం ఉందట. ఇప్పటికే నందిని రెడ్డి ఆల్ రెడీ నానితో అలా మొదలైంది అనే హిట్ మూవీని తీసింది.