ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ తో పాటు వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా రిలీజైన టీజర్ కు కూడా మంచి స్పందన రావడం.. ఈ సినిమా మార్కెట్ కి బాగా ప్లస్ కానుంది. నిర్మాత సురేష్ బాబు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు. దాంతోనే నైజాంలో ఈ సినిమాకు భారీ రేటును చెబుతున్నారు. ఈ సినిమా కోసం మొదట్లో ఆసక్తి చూపించిన దిల్ రాజు, ఆ రేటు చూసి సైలెంట్ గా సైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది.
మరి, ఈ సినిమాను ఎవరు కొంటారో చూడాలి. ఎలాగూ సురేష్ ప్రొడక్షన్స్ కి కూడా థియేటర్స్ ఉన్నాయి కాబట్టి, ఓన్ రిలీజ్ కైనా సురేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించొచ్చు. మరి ఏమి జరుగుతుందో చూడాలి. ఈ చిత్రంలో వెంకటేశ్ సరసన ప్రియమణి కథానాయికగా నటిస్తోంది. సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను నిర్మించిన ఈ సినిమాలో వైవిధ్యమైన షేడ్స్ ఉన్న పాత్రలో వెంకీ అలరించనున్నాడు.
అందుకే వెంకీ అభిమానులు ఈ చిత్రంకై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ, ప్రస్తుతం కరోనా ప్రవాహంలో జనం థియేటర్స్ మొహం కూడా చూడని పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి, నారప్పకి ఓపెనింగ్స్ వస్తాయా అనేది డౌటే. ఏది ఏమైనా కరోనా సెకండ్ వేవ్ కూడా సినీ పరిశ్రమను పెద్ద దెబ్బే కొట్టింది.