Homeఎంటర్టైన్మెంట్అక్షయ్ భారీ విరాళంపై ట్వింకిల్ ఖన్నా ట్వీట్

అక్షయ్ భారీ విరాళంపై ట్వింకిల్ ఖన్నా ట్వీట్

కరోనా కట్టడి కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ అభినందించారు. కరోనా నివారణకు తనవంతు సాయంగా పీఎం సహాయనిధికి రూ.25కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో అక్షయ్ కుమార్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే పెద్దమొత్తంలో భారీ విరాళం ప్రకటించడంపై అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా ట్వీటర్లో తన స్పందనను తెలియజేశారు.

కరోనా కట్టడి కోసం తన భర్త రూ.25 కోట్ల భారీ విరాళం ఇచ్చి తనను ఎంతో గర్వపడేలా చేశారని పేర్కొంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించే ముందు నేను కూడా ఒకసారి ఆలోచించుకోమని సూచించినట్లు తెలిపింది. మనకు కూడా కొంత మనీ అవసరం కదా.. ఇంత పెద్ద మొత్తం ఇస్తే ఎలా అని అన్నానని చెప్పింది. దానికి అక్షయ్ స్పందిస్తూ ‘నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు నా దగ్గర ఏమీ లేదు.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని.. ఇలాంటి పరిస్థితులలో ఏమీ లేని వారి కోసం ఏదైనా సాయం చేయకుండా ఎలా ఉండగలను’ అంటూ సమాధానం ఇచ్చారని ట్వింకిల్ ఖన్నా తన ట్వీట్‌లో తెలిపారు.

కరోనా నివారణకు ఇంత మొత్తంలో భారీ విరాళం ప్రకటించిన హీరోగా అక్షయ్ కుమార్ టాప్ లో నిలిచారు. కరోనా నివారణకు టాలీవుడ్ సెలబెట్రీలు ముందుకురాగా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడంతో పలు విమర్శలకు తావిచ్చింది. అయితే బాలీవుడ్ నుంచి స్పందించిన అక్షయ్ కుమార్ ఏకంగా రూ.25కోట్ల భారీ విరాళం ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశాడు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని అక్షయ్ కుమార్ చాటిచెప్పాడు. అక్షయ్ కుమార్ దాతృత్వానికి ప్రతీఒక్కరు ఆయనను అభినందిస్తున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version