Trisha: కాలేజ్ డేస్ లోనే మహేష్ తో నాకు అలాంటి రిలేషన్, ఇది ఎవరికీ తెలియదు.. త్రిష షాకింగ్ కామెంట్స్

మహేష్ బాబుతో సినిమాల్లోకి రాక ముందే పరిచయం ఉందని హీరోయిన్ త్రిష చెప్పారు. వారిద్దరి ఒకప్పటి రిలేషన్ ఏమిటో ఆమె వెల్లడించారు. ఇంతకీ త్రిష ఏమన్నారో చూద్దాం..

Written By: S Reddy, Updated On : September 18, 2024 9:57 am

Trisha

Follow us on

Trisha: మహేష్ బాబు-త్రిష కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. అతడు, సైనికుడు చిత్రాల్లో వీరిద్దరూ జతకట్టారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అతడు ప్రేక్షకుల ఆల్ టైం ఫేవరేట్ మూవీ. ఈ చిత్రంలో మహేష్ బాబు-త్రిషల కెమిస్ట్రీ అద్భుతం. బావ ప్రేమ కోసం పరితపించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో త్రిష ప్రేక్షకులను కట్టిపడేసింది. బ్రహ్మానందం కామెడీ ట్రాక్స్, త్రివిక్రమ్ డైలాగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్.. మొత్తంగా అతడు ఫుల్ మీల్ వంటి చిత్రం.

మణిశర్మ సాంగ్స్ సైతం అలరిస్తాయి. అతడు థియేటర్స్ లో కమర్షియల్ గా ఆడలేదు. బుల్లితెర మీద మాత్రం అనేక రికార్డులు నెలకొల్పింది. అతడు అనంతరం సైనికుడు చిత్రంలో త్రిషతో మహేష్ బాబు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. గుణశేఖర్ తెరకెక్కించిన సైనికుడు మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. మరలా త్రిష-మహేష్ బాబు కలిసి మూవీ చేయలేదు.

కాగా గతంలో ఓ సందర్భంలో మహేష్ బాబును ఉద్దేశిస్తూ త్రిష ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమాల్లోకి రాక ముందే వారికి పరిచయం ఉందన్న షాకింగ్ నిజం బయటపెట్టింది. మహేష్ బాబుపై మీ అభిప్రాయం ఏమిటని యాంకర్ అడగ్గా… మహేష్ బాబు నాకు ఇష్టమైన హీరోల్లో ఒకరు. అంత పెద్ద సూపర్ స్టార్ అయినప్పటికీ చాలా గౌరవిస్తారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. కాలేజ్ డేస్ లోనే మహేష్ బాబుతో నాకు పరిచయం ఉంది.

మహేష్ బాబు చదువుకునే రోజుల్లో చెన్నైలోనే ఉన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా మహేష్ తో నాకు పరిచయం ఏర్పడింది. భవిష్యత్ లో నటులు అవుతామని అప్పుడు మాకు తెలియదు. అయితే హాయ్ బై, చెప్పుకునే స్నేహం మాత్రమే. మహేష్ బాబు చాలా కష్టపడతారు. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 10 గంటల వరకు కూడా సెట్స్ లోనే ఉంటారు. కారవాన్ లోకి కూడా పెద్దగా వెళ్ళరు.

ప్రతి ఒక్క నటుడు సన్నివేశాలను మానిటర్ ముందు కూర్చుని గమనిస్తాడు. మహేష్ బాబు అంతలా కష్టపడుతుంటే, నాకు గిల్టీగా అనిపించేది, అని త్రిష చెప్పుకొచ్చారు. త్రిష ప్రస్తుతం తెలుగులో విశ్వంభర చిత్రం చేస్తుంది. ఏళ్ల తర్వాత చిరంజీవి-త్రిష కలిసి చిత్రం చేస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో విశ్వంభర తెరకెక్కుతుంది. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విశ్వంభర విడుదల కానుంది.

ఇక మహేష్ ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. ఆయన మేకోవర్ షాక్ ఇచ్చేలా ఉంది. పొడవాటి జుట్టు, గుబురు గడ్డంలో మహేష్ బాబు గతానికి భిన్నంగా కనిపిస్తున్నారు. డిసెంబర్ లో ఈ చిత్రానికి రాజమౌళి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడని సోషల్ మీడియా టాక్. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ ఎస్ఎస్ఎంబి 29 నిర్మిస్తున్నారట.