The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’ బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6 రోజులైంది, ఇప్పటికీ కలెక్షన్స్ చాలా స్టడీ గా ఉన్నాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి కేవలం 6 రోజుల్లోనే ఇండియా వైడ్ గా 11 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అంటే మన ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం 106 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు అన్నమాట. నిన్న కూడా ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 6 కోట్ల 89 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఇది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్ గా ఇండియా వైడ్ వచ్చిన నెట్ వసూళ్లు 79 కోట్ల రూపాయిలు , ఈ వీకెండ్ తో 100 కోట్ల మార్కుని కూడా అందుకోనుంది ఈ చిత్రం.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల నుండి కూడా ఈ చిత్రానికి సెన్సేషనల్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఒక్క తెలంగాణ ప్రాంతం నుండే ఈ చిత్రానికి 6 రోజుల్లో 11 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి 4 కోట్ల 77 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు సమాచారం. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 15 కోట్ల 77 లక్షలు అన్నమాట. ఒక ఇంగ్లీష్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ రేంజ్ గ్రాస్ రావడం చిన్న విషయం అయితే కాదు. అదే విధంగా ఇతర సౌత్ రాష్ట్రాల విషయానికి వస్తే , కర్ణాటక రాష్ట్రము నుండి 17 కోట్ల 57 లక్షలు రాగా, తమిళనాడు రాష్ట్రం నుండి 9 కోట్లు , కేరళ నుండి 6 కోట్ల 58 లక్షలు వచ్చినట్టు సమాచారం.
ఓవరాల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు 3000 కోట్ల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. అమెరికన్ డాలర్స్ లెక్కల్లోకి చూస్తే 400 మిలియన్ డాలర్లకు చాలా దగ్గరగా ఉంది ఈ చిత్రం. ఇదే తరహా థియేట్రికల్ రన్ కొనసాగితే , కచ్చితంగా ఈ చిత్రం ప్రతిష్టాత్మక 1 బిలియన్ మార్కును ని అందుకుంటుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ నమోదు అయ్యే వసూళ్లతో ఈ సినిమా 1 బిలియన్ మార్కుని అందుకుంటుందా లేదా అనే విషయం పై క్లారిటీ వస్తుంది. అదే విధంగా ఈ నెలాఖరున స్పై డర్ మ్యాన్ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రభావం కూడా ‘ది ఒడిస్సీ’ చిత్రం పై పడే అవకాశాలు ఉన్నాయి.





