నేను వాళ్ళకే సొంతం – ‘పూజా హెగ్డే’

ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరికి ‘పాన్ ఇండియా’ మోజు పట్టుకుంది. ప్రతి స్టార్ హీరో మెయిన్ టార్గెట్ పాన్ ఇండియానే. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు ఇప్పటికే పాన్ తో తమ స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. కాకపోతే ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కి తప్ప దక్షిణాది హీరోలెవ్వరికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు. దేశమంతా పాపులారిటీ లేదు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. తెలుగు హీరోయిన్స్ […]

Written By: admin, Updated On : August 6, 2021 10:22 am
Follow us on

ఇప్పుడు టాలీవుడ్ హీరోలందరికి ‘పాన్ ఇండియా’ మోజు పట్టుకుంది. ప్రతి స్టార్ హీరో మెయిన్ టార్గెట్ పాన్ ఇండియానే. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు ఇప్పటికే పాన్ తో తమ స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. కాకపోతే ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కి తప్ప దక్షిణాది హీరోలెవ్వరికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు. దేశమంతా పాపులారిటీ లేదు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. తెలుగు హీరోయిన్స్ లో నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఏకైక హీరోయిన్ ‘పూజా హెగ్డే’ మాత్రమే. పూజాకి ఇప్పటికే హిందీలో కూడా డిమాండ్ పెరిగింది. పైగా పూజా కెరీర్ కూడా హిందీలోనే స్టార్ట్ అయింది. మధ్యలో తెలుగులో స్టార్ హీరోయిన్ అయినా.. ఆమెకు మొదటి నుండి ప్రధాన టార్గెట్ బాలీవుడే.

ఈ విషయం అందరికి తెలుసు. అందుకే, పూజా తాను తెలుగోళ్ళకి సొంతం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంది. తన తల్లితండ్రులు కన్నడిగులు అయినా, నేను పుట్టింది, పెరిగింది ముంబైలో అయినా.. నన్ను స్టార్ ను చేసింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే అని, తనకు మొదట స్టార్ డమ్ ను ఇచ్చింది తెలుగు ప్రేక్షకులే అని, అందుకే, తాను తెలుగు సినిమాకే రుణపడి ఉంటాను అని ‘పూజ హెగ్డే’ బాగానే లౌక్యం చూపిస్తోంది.

పైగా ఇంకా కబుర్లు చెబుతూ ‘నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆలిండియా స్టార్ కావాలని కల కన్నాను. కానీ నాకు తెలుగులో ముందు పేరు వచ్చింది. ఇప్పుడు తమిళ, హిందీ సినిమాలు కూడా చేస్తున్నాను. మొత్తానికి నా కల నెరవేరుతోంది’ అంటూ తెగ ఫీల్ అవుతూ చెబుతుంది పూజా. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘రాధేశ్యామ్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ఆచార్య’ సినిమాల్లో నటిస్తోంది పూజా.