Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం రంగం సిద్ధమవుతుంది. త్వరలోనే సరికొత్త సీజన్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక, హౌస్ డిజైన్ వంటి పనులు పూర్తయినట్లు సమాచారం. ఆగస్టు మొదటి వారంలో షో లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. దీంతో బిగ్ బాస్ సీజన్ 8 పై ఇప్పటి నుంచే బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ నయా సీజన్ కి సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ న్యూస్ వెలుగులోకి వస్తుంది.
ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే .. బుల్లితెర పై అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న షో గా బిగ్ బాస్ నిలిచింది. ఇప్పటికే ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. సీజన్ 6 రేటింగ్ పడిపోవడంతో ఉల్టా పుల్టా అంటూ కొత్త కాన్సెప్ట్ తో సీజన్ 7 తీసుకువచ్చారు. ఫలితంగా గత సీజన్ సూపర్ సక్సెస్ అయింది. ఒక సామాన్యుడు విజేత కావడం హైలెట్ అయింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టాప్ సెలెబ్స్ ని వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి రన్నర్ గా నిలిచాడు. మొదటి నుండి టైటిల్ విజేత అనుకున్న శివాజీ.. మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఆ జోష్ లో ఇప్పుడు సీజన్ 8 ని మరింత విభిన్నంగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల కాలంలో కాంట్రవర్సీల్లో ఉన్న సెలబ్రిటీల పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారట. సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న యూట్యూబర్స్ పై కూడా మేకర్స్ దృష్టి పెడుతున్నారట. తాజా సమాచారం ప్రకారం… ఎనిమిదవ సీజన్లో రెండు జంటల్ని తీసుకువస్తున్నారట. గతంలో భార్యాభర్తలైన వితికా – వరుణ్ సందేశ్ ని జంటగా హౌస్ లోకి పంపించారు. అలాగే సీజన్ 6లో సీరియల్ నటి మెరీనా తన భర్త రోహిత్ తో పాటు షోలో పాల్గొంది.
లేటెస్ట్ సీజన్లో ఏకంగా రెండు జంటలు ఎంట్రీ ఇస్తాయని అంటున్నారు. పైగా వాళ్లకు స్పెషల్ రూమ్స్ కూడా కేటాయిస్తారు అని సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలియదు. కానీ నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. హౌస్లో మసాలా కంటెంట్ కోసమే ఈ ప్లాన్ అంటున్నారు. జంటల మధ్య ముద్దులు, హగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఎటూ భార్యాభర్తలే కాబట్టి పెద్దగా విమర్శలు తలెత్తే అవకాశం ఉండదని మేకర్స్ ఆలోచన అట.
ఇక సీజన్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బర్రెలక్క, కుమారి ఆంటీ, రీతూ చౌదరి, రాజ్ తరుణ్, హేమ, సురేఖ వాణి, బంప్చిక్ బబ్లు, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్ వంటి సెలెబ్స్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అనూహ్యంగా వేణు స్వామి సైతం హౌస్లో అడుగుపెడుతున్నారట. ఇటీవల కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన వేణు స్వామికి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనే టాక్ నడుస్తుంది. అలాగే వరుసగా ఆరో సీజన్ కి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నారని సమాచారం.
బిగ్ బాస్ సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతుండగా మరోవైపు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చాలా కాలంగా సంప్రదాయవాదులు బిగ్ బాస్ షోని వ్యతిరేకిస్తున్నారు. బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేశారు. మేకర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నాగార్జున సైతం ఎన్ని విమర్శలు వచ్చినా హోస్టింగ్ బాధ్యతల నుండి తప్పుకోవడం లేదు. అందుకు కారణం బిగ్ బాస్ షోకి ఉన్న క్రేజ్…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Bigg boss 8 husband and wife romance in the house two couples together this time
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com