Nagarjuna: రేవంత్ సర్కార్ కి షాక్.. నాగార్జునకు భారీ ఊరట.. N కన్వెన్షన్ కూల్చివేతపై ట్విస్ట్

పిటీషన్ ని విచారించిన జస్టీస్ టీ వినోద్ కుమార్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ఈ తీర్పు వచ్చేలోపే N కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసారు. ఇలాంటి తీర్పు వస్తుందని ఊహించే, ప్రభుత్వం తెలివిగా ఈ కూల్చివేత కార్యక్రమంని తలపెట్టింది అంటూ సోషల్ మీడియాలో నాగార్జున అభిమానులు ఆరోపిస్తున్నారు.

Written By: Vicky, Updated On : August 24, 2024 4:30 pm

Nagarjuna(2)

Follow us on

Nagarjuna: నేడు ప్రభుత్వానికి సంబంధించిన హైడ్రా హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉండే హీరో నాగార్జున N కన్వెన్షన్ ని హాల్ ని అక్రమ నిర్మాణ కట్టడం గా భావించి కూల్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన నాగార్జున గతం లో ప్రభుత్వం ఇచ్చిన అక్రమ నోటీసు పై అప్పట్లో హై కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిందని, కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ మాకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అన్యాయంగా కూల్చేయడం బాధాకరం అని, దీనిపై హై కోర్టులో న్యాయ పోరాటం చేస్తాం అంటూ నాగార్జున కాసేపటి క్రితమే ఒక ట్వీట్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ఆయన తన లాయర్ తరుపున ప్రభుత్వం తీసుకున్న చర్యని సవాలు చేయిస్తూ ఒక పిటీషన్ వేయించాడు. దీనిపై స్పందించిన తెలంగాణ హై కోర్టు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలను తక్షణమే ఆపాలి అంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

పిటీషన్ ని విచారించిన జస్టీస్ టీ వినోద్ కుమార్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ఈ తీర్పు వచ్చేలోపే N కన్వెన్షన్ ని హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసారు. ఇలాంటి తీర్పు వస్తుందని ఊహించే, ప్రభుత్వం తెలివిగా ఈ కూల్చివేత కార్యక్రమంని తలపెట్టింది అంటూ సోషల్ మీడియాలో నాగార్జున అభిమానులు ఆరోపిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఎన్నో వివాహాలు జరిగాయని, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే హాల్ లో తన కూతురికి పెళ్లి కూడా చేసాడని నాగార్జున అభిమానులు ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఇప్పుడు కోర్టు కూల్చివేతపై స్టే విధించింది కాబట్టి, నాగార్జున మళ్ళీ N కన్వెన్షన్ హాల్ ని నిర్మిస్తాడా?, లేదా అలాగే వదిలేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. సరిగ్గా పెళ్లిళ్ల సీజన్ లో ఇలా జరగడం నాగార్జున కి వ్యాపార పరంగా పెద్ద నష్టమే జరిగింది అనుకోవాలి. రాబోయే రోజుల్లో కొంతమంది ప్రముఖుల పెళ్లిళ్లకు కోసం ఈ హాల్ ని అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ అడ్వాన్స్ లు మొత్తం తిరిగి వెనక్కి ఇవ్వాల్సిన పరిస్థితి.

ఇక ప్రస్తుతం నాగార్జున చేస్తున్న సినిమాల విషయానికి వస్తే శేఖర్ కమ్ముల తో ఆయన ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో ధనుష్ మరో హీరోగా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటుగా ఆయన త్వరలో స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో కి హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఈ సీజన్ కోసం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ఈ సీజన్ సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కానుంది.