Samantha: విడాకుల తర్వాత పూర్తిగా మారిపోయిన సమంతను చూశారా?

జీవితం ఒంటరి అయితే ఎవరైనా ఏం చేస్తారు? అయితే తోడుకోసం వెతుకుతారు. అది సాధ్యం కాకపోతే దైవభక్తిలో మునిగిపోతారు. ఇప్పుడు సమంత కూడా అలానే చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఆమెకు తోడు ఎవరూ లేకున్నా.. ఆ దేవుడు ఉన్నాడని మనశ్శాంతి కోసం దర్శనాల బాట పట్టేసింది. సమంత తాజాగా దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో విహరిస్తూ అక్కడి అందాలను అస్వాదిస్తోంది. ఒకరి జీవితంలో విడాకులు ఎంత ప్రభావితం చూపిస్తాయో సమంతను చూస్తే తెలుస్తుంది. ఆమె తన ఫస్ట్రేషన్ ను తగ్గించుకునేందుకు […]

Written By: NARESH, Updated On : October 21, 2021 3:18 pm
Follow us on

జీవితం ఒంటరి అయితే ఎవరైనా ఏం చేస్తారు? అయితే తోడుకోసం వెతుకుతారు. అది సాధ్యం కాకపోతే దైవభక్తిలో మునిగిపోతారు. ఇప్పుడు సమంత కూడా అలానే చేస్తోంది. ఇప్పటికిప్పుడు ఆమెకు తోడు ఎవరూ లేకున్నా.. ఆ దేవుడు ఉన్నాడని మనశ్శాంతి కోసం దర్శనాల బాట పట్టేసింది. సమంత తాజాగా దేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో విహరిస్తూ అక్కడి అందాలను అస్వాదిస్తోంది.

Samantha_rishikesh

ఒకరి జీవితంలో విడాకులు ఎంత ప్రభావితం చూపిస్తాయో సమంతను చూస్తే తెలుస్తుంది. ఆమె తన ఫస్ట్రేషన్ ను తగ్గించుకునేందుకు ఇప్పుడు ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తున్నారు.

విడాకుల ప్రకటనకు ముందు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్న సమంత.. అనంతరం ఇప్పుడు దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శన బాట పట్టింది. నాగచైతన్యతో విడిపోయాక ఆ బాధను దిగమింగుకుంటూ దైవదర్శనాలు చేస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ లో తన విడాకుల విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన యూట్యూబ్ చానెల్స్ కు నోటీసులు ఇచ్చి షాకిచ్చిన సమంత ఈరోజు హిమాలయాల్లో ప్రత్యక్షమైంది. ప్రతిష్టాత్మకమైన ఛార్ ధామ్ యాత్ర చేపట్టింది. రిషికేష్, యమునోత్రి, గంగోత్రి ఇలా పవిత్ర దేవాలయాల బాటపట్టింది.

సమంతకు తోడుగా ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి వెంటే ఉన్నారు. ఇద్దరూ హెలిక్యాప్టర్ ముందర ఈ ఛార్ దామ్ యాత్రకు వెళుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకుల తర్వాత సమంత మానసికంగా కాస్త ఇబ్బంది పడిందని.. అందుకే ఇలా ఆధ్యాత్మిక లోకంలో విహరిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. మనసు కుదుటపడేందుకు ఈ యాత్రలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.