Homeఎంటర్టైన్మెంట్Sai Pallavi : డ్రామాలు ఆడొద్దు అంటూ సాయి పల్లవి కి నెటిజెన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!

Sai Pallavi : డ్రామాలు ఆడొద్దు అంటూ సాయి పల్లవి కి నెటిజెన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!

Sai Pallavi : జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ముష్కరుల దాడి పట్ల భారత దేశ ప్రజలు ఎంతో ఆవేశంతో ఉన్నారు. కాల్పులకు పాల్పడి 28 మంది అమాయకులను హతమార్చిన ఆ నీచులను వెంటనే చంపేయాలి అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతం లో సెలబ్రిటీలు కొంతమంది వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిని నెటిజెన్స్ ఏకిపారేస్తున్నారు. దాడిని ఖండించిన వారిపై డ్రామాలొద్దు అంటూ మండిపడుతున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) కూడా చేరింది. గతం లో సాయి పల్లవి చేసిన కామెంట్స్ ని గుర్తు చేస్తూ మండిపడుతున్నారు. ఇంతకు ఆమె ఏమి మాట్లాడిందంటే ‘మన ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ జనాలను ఉగ్రవాదులు అనుకుంటుంది, అలాగే వాళ్ళు కూడా మనల్ని ఇలాగె అనుకుంటూ ఉంటారు. ఇవే హింసాత్మక చర్యలకు దారి తీస్తుంది. మన ఆలోచన విధానం మారాలి’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read : సాయి పల్లవి రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..?

దగ్గుపాటి రానా తో సాయి పల్లవి చేసిన ‘విరాటపర్వం’ మూవీ విడుదల సమయంలో, ఆమె ప్రొమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పట్లోనే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లోని నెటిజెన్స్ సాయి పల్లవి ని ఏకిపారేశారు. దీనికి ఆమె మళ్ళీ ప్రత్యేకంగా వివరణ కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కూడా జనాలు శాంతించలేదు. ఆమె పై ఆ విషయం లో ఎంత కోపం గా ఉన్నారో నిన్న ఆమె వేసిన ట్వీట్ క్రింద కామెంట్స్ ని చూస్తే అర్థం అవుతుంది. ఇంతకీ ఆమె వేసిన ట్వీట్ ఏమిటంటే ‘చరిత్రలో ఎన్నో అమానవీయ హింసాత్మక సంఘటనలను చూసాను. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉండడం నా హృదయాన్ని కలిచివేసింది. జీవితం లో అందమైన జ్ఞాపకాలను తమతో పాటు తీసుకొని వెళ్లాలని వచ్చిన అమాయకులను, కొన్ని క్రూర మృగాలు హతమార్చాయి. తమ కాళ్ళ ముందే కుటుంబాలను చంపబడడాన్ని చూసి నోటి నుండి మాటలు రావడం లేదు. ఆ కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను’ అంటూ సాయి పల్లవి మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

ఈ ట్వీట్ కి దాదాపుగా రెండు వేల కామెంట్స్ వచ్చాయి. ఆమె అప్పట్లో మాట్లాడిన వీడియో ని షేర్ చేస్తూ నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే నువ్వు ఎలాంటిదానివో మాకు అర్థమైంది, డ్రామాలు ఆపు అంటూ తిట్టసాగారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఆమె అభిమానులు కూడా ఈ విషయం లో సపోర్టుకు రాలేదు. తనకు వచ్చిన కామెంట్స్ పై సాయి పల్లవి స్పందిస్తుందో లేదో చూడాలి. ఇక రీసెంట్ గానే ఆమె ‘తండేల్’ చిత్రం ద్వారా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హిందీ లో తెరకెక్కుతున్న ‘రామాయణం’ లో సీతగా నటిస్తుంది.

Also Read : బడా బ్యానర్ లో సాయి పల్లవికి బంపర్ ఆఫర్?

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version