Homeఎంటర్టైన్మెంట్Rashmi Gautam: వారికి ఈ భూమిపై బతికే హక్కులేదు-రష్మి

Rashmi Gautam: వారికి ఈ భూమిపై బతికే హక్కులేదు-రష్మి

Rashmi Gautam: యాంకరింగ్​తో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై.. పలు సినిమాల్లో హీరోయిన్​గా కనిపించి అలరించిన నటి రష్మీ గౌతమ్​. తన మాటతీరుతో ప్రస్తుత టాప్​ యాంకర్స్​లో ఒకరుగా ట్రెండింగ్​లో నిలుస్తోంది. గుంటూరు టాకీస్​ సినిమాతో హీరోయిన్​గా నిటంచి.. ప్రస్తుతం పలు షోలతో పాటు సినిమాల్లోనూ ఫుల్​ బిజీగా గడిపేస్తోంది ఈభామ. కెరీర్​లో ఎంత బిజీ ఉన్నా.. సోషల్​ మీడియాలో యాక్టీవ్​గా ఉంటూ పలు విషాయాలపై స్పందిస్తూ ఉంటుంది రష్మి. హాట్​ ఫొటోలను షేర్​ చేస్తూ.. కుర్రకారును కవ్విస్తూ ఉంటుంది. మరోవైపు, సమాజంలో జరుగుతున్న ఘటనలపైనా తనదైన స్టైల్​లో రియాక్ట్ అవుతూ ఉంటుంది.

rashmi-gautham-respond-on-recent-issue-happend-at-west-bengal

ముఖ్యంగా మూగజీవులపై జరిగే దాడులపై.. వాటికి హాని కలిగించే విషయాలపై స్పందిస్తూ.. సమాజంలో ఉన్న అవిటితనాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతుంది. తాజాగా, మరోసారి అలాంటి పోస్ట్ చేస్తూ.. ఎమోషనల్​ అయ్యింది రష్మి. ఇటీవల దీపావళికి పశ్చిమ బెంగాల్​లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంబరాల్లో భాగంగా కొందరు ఆకతాయిలు.. వీధి కుక్క తోకకు బాణాసంచ కట్టి పేల్చారు. దీంతో ఆ కుక్కకు తీవ్ర గాయాలయ్యాయి.

తోక కూడా తెగిపోయింది. ఇది గమనించిన కొంతమంది.. కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిక్స చేయించారు. ప్రస్తుతం ఆ శునకం సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా తెలుసుకున్న రష్మి.. తనదైన స్టైల్​లో స్పందించింది. సమాజంలో మానవత్వం చచ్చిపోయిందంటూ భావోద్వేగంతో వ్యాఖ్యానించింది. అలాంటి మనుషులకు ఈ భూమిపై బతికే హక్కు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్మిక పోస్ట్​కు నెటిజన్లు సైతం సపోర్ట్​ చేస్తూ.. ఆ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కామెంట్స్​ చేస్తున్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version