SS Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన రాజమౌళి బాహుబలితో పాన్ ఇండియా లో తన సత్తా చాటుకున్నాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్న ఆయన తను చేయబోయే సినిమాల విషయంలో చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో మొదటి సక్సెస్ ని అందుకున్న ఆయన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో వరుసగా 12 విజయాలను తన ఖాతాలో వేసుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఇక కెరియర్ స్టార్టింగ్ లో రాజమౌళి డైరెక్షన్ చేసిన ‘సై’ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఆవుల గిరి ఆ సినిమాతో నష్టాన్ని చవిచూశాడని తనే ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ముఖ్యంగా సై సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న కూడా కమర్షియల్ గా ఆ సినిమాకి రావాల్సినంత కలెక్షన్స్ రాలేదనే చెప్పాలి. దానివల్ల ఆయన కొంతవరకు డబ్బులను కూడా కోల్పోయాననే చెప్పాడు. ఇక ఆ తర్వాత క్రమంలో ఆయన ఒకటి రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేసి సినిమా ఇండస్ట్రీ తనకు అచ్చి రాదనే ఉద్దేశ్యంతో సినిమా ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడు.
ప్రస్తుతం ఆయన సినిమాలను ప్రొడ్యూస్ చేయకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి ఎన్టీఆర్ కెరియర్ లో చేసిన సినిమాలన్నీ సక్సెస్ ఫుల్ గా నిలిచినప్పటికి ప్రొడ్యూసర్లకు కూడా విపరీతంగా లాభాలను తీసుకొచ్చి పెట్టాయి.
సై సినిమా విషయంలో మాత్రమే ఆ లెక్క తప్పింది అంటూ పలువురు సినిమా మేధావులు సైతం ఆ మూవీ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని చాలా ప్రస్ఫుటంగా చెబుతూ ఉంటారు. ఇక ఏది ఏమైనా కూడా జక్కన్న ఏదైనా సినిమా చేస్తే ఆ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టి వర్క్ చేస్తుంటాడు.
అలాగే ప్రేక్షకుల్లో ఆ సినిమా తాలూకు ఇంటెన్షన్ క్రియేట్ చేయడానికి విపరీతమైన ప్రమోషన్స్ కూడా చేపడుతూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే ఆయన చేసిన సినిమాల పట్ల ప్రేక్షకుల్లో విశేషమైన బజ్ క్రియేట్ అవుతుంటుంది…ఇక ప్రస్తుతం వారణాసి తో ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు…
