Pradeep Ranganathan New Movie: తమిళనాడు లో ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ‘కోమలి’ అనే చిత్రం తో డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టిన ఈయన , మొదటి సినిమాతోనే భారీ హిట్ ని అందుకున్నాడు . ఆ తర్వాత ఈయన స్వీయ దర్శకత్వం లో ‘లవ్ టుడే’ అనే చిత్రం లో హీరో గా నటించాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం తర్వాత ఆయన అశ్వత్ మారిముత్తు దర్శకత్వం లో ‘డ్రాగన్’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అంతే కాదు ఈ చిత్రం తర్వాత ప్రదీప్ రంగనాథన్ తమిళనాడు యూత్ కి ఐకాన్ లాగా మారిపోయాడు. ఆయన నుండి ఒక సినిమా వతుంది అంటే కచ్చితంగా బాగుంటుంది అనే నమ్మకాన్ని జనాల్లో కలిగించాడు . అయితే యూట్యూహ్ ఆడియన్స్ కి ‘డ్రాగన్’ చిత్రం ఒక ఎమోషన్. వాళ్లకు తమని తాము వెండితెర పై చూసుకున్నట్టుగా అనిపిస్తుంది ఈ చిత్రం. ఇలాంటి సినిమాలు కేవలం ఒక్క పార్ట్ తో ఆగిపోకూడదు , ఒక ఫ్రాంచైజ్ లాగా రావాలని కోరుకునే వారు. వాళ్ళ కోరికకు తగ్గట్టే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకొని వెళ్ళబోతున్నాడట డైరెక్టర్ అస్వత్. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆయన ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాకు సీక్వెల్ ని తీసే ఆలోచన ఉందని విడుదలైన కొత్తల్లోనే చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను .
త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ ని సెట్స్ మీదకు తీసుకుని రాబోతున్నాను. స్క్రిప్ట్ వర్క్ మొత్తం దాదాపుగా పూర్తి అయ్యింది. ఇక హీరో కి వినిపించడమే బ్యాలన్స్ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్. ఈ సీక్వెల్ ని మొదటి భాగం తో సమానంగా అద్భుతంగా తెరకెక్కిస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఈసారి 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టిస్తుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి భాగం లో హీరో తన తప్పుని తెలుసుకొని , ఫేక్ ఉద్యోగాన్ని వదిలేసి జైలుకి వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ డెలివరీ బాయ్ గా చేస్తూ , బీటెక్ లో మరోసారి జాయిన్ అవుతాడు. అప్పుడు అతని HOD హీరో నిజాయితీని మెచ్చి తన కూతురుని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధం అవుతాడు. హీరో కూడా అందుకు ఒప్పుకుంటాడు , ఆ తర్వాత ఏమి జరగబోతుంది అనేది సీక్వెల్ లో చూడాలి .