Indian Cinema Industry Heroes: ఇండస్ట్రీలో హీరోల మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఒకరు ఒక సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మరొక హీరో దానికి డిఫరెంట్ గా ఉన్న సినిమాలను చేసి అంతకు మించిన సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా హీరోలు సైతం పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదిగారు. కాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు వైవిధ్యమైన మార్పులైతే జరిగాయి. దానికి తగ్గట్టుగానే స్టార్ హీరోలందరు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా క్లియర్ గా ఉంటున్నారు… ఇక ప్రస్తుతం ఇండియన్స్ సినిమా ఇండస్ట్రీని శాసించే హీరోలు ఇద్దరు మాత్రమే అంటూ బాలీవుడ్ మీడియాలో సైతం కొన్ని కథనాలైతే వస్తున్నాయి. బాలీవుడ్ హీరోల హవా ముగిసిపోయింది. ఇక తెలుగు నుంచి ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తమ సత్తా చూపిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక రాబోయే రెండు సినిమాలతో వీళ్ళిద్దరూ కనుక సూపర్ సక్సెస్ లను సాధిస్తే పాన్ ఇండియా ను శాసించే హీరోలు వీళ్ళిద్దరే అవుతారు అంటూ బాలీవుడ్ మీడియాలో కొన్ని కథనాలైతే వస్తున్నాయి.
Also Read: పవన్ ఆదేశాలతో రంగంలోకి నాగబాబు
ఇక సోషల్ మీడియాలో సైతం దీని మీద తెలుగు ప్రేక్షకులు స్పందిస్తున్నారు. వీళ్ళు భారీ విజయాలను సాధిస్తూ తమకంటూ ఒక క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి విజయాలను సాధిస్తే వీళ్లను మించిన స్టార్ హీరోలు మరొకరు ఉండరు అంటూ వాళ్లు కూడా కామెంట్స్ చేస్తుండటం విశేషం… ఇక ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్ లాంటి సినిమాలను చేస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలు తగ్గట్టుగానే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఈ ఇద్దరు కూడా తమిళ్ డైరెక్టర్లే కావడం వాళ్ళు టాలెంటెడ్ డైరెక్టర్లు అవ్వడంతో ఈ రెండు సినిమాలు భారీ విజయాలను సాధిస్తాయని ప్రతి ఒక్కరు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…