ఆ ఘనత ఒక్క ప్రభాస్ కే దక్కుతుంది !

ముందు తరం స్టార్ హీరోలు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసేవారు. అసలు ఎలా చేసి ఉంటారు ? అంటూ నేటి జనరేషన్ పెద్ద షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెడుతుంది. కానీ ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లి తోటి హీరోలకు పెద్ద షాక్ ఇచ్చాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్, తన సినిమాల స్పీడ్ ను రెట్టింపు చేశాడు. ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, అనగా మరో […]

Written By: admin, Updated On : July 24, 2021 12:48 pm
Follow us on

ముందు తరం స్టార్ హీరోలు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేసేవారు. అసలు ఎలా చేసి ఉంటారు ? అంటూ నేటి జనరేషన్ పెద్ద షాకింగ్ ఎక్స్ ప్రెషన్ పెడుతుంది. కానీ ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లి తోటి హీరోలకు పెద్ద షాక్ ఇచ్చాడు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ అయ్యాక ప్రభాస్, తన సినిమాల స్పీడ్ ను రెట్టింపు చేశాడు.

ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది, అనగా మరో పది రోజుల చిత్రీకరణ జరుపుకుంటే సినిమా పూర్తి అవుతుంది. ‘రాధేశ్యామ్’తో పాటే ప్రభాస్ మిగిలిన మూడు సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. ప్రశాంత్ నీల్ తీస్తున్న ‘సలార్’ 30 శాతం షూటింగ్ పూర్తి అయింది. హైదరాబాద్ లో ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ సినిమా.

బాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ ఓం రౌత్ తీస్తున్న ‘ఆదిపురుష్’ 50 శాతం షూటింగ్ పూర్తి అయింది, వచ్చే రెండు నెలల్లో ఈ సినిమాని దాదాపు ఫినిష్ చేయడానికి ప్రభాస్ ఈ సినిమాకి ఇప్పటికే బల్క్ డేట్స్ కేటాయించాడు. ఇక ఈ రోజు దర్శకుడు నాగ్ అశ్విన్ తీస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీను కూడా స్టార్ట్ చేశాడు ప్రభాస్.

ఇలా ఒకేసారి నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లిన ఘనత, బహుశా ఈ జనరేషన్ స్టార్స్ లో ఒక్క ప్రభాస్ కే దక్కుతుంది అనుకుంటా. ఇక ‘రాధే శ్యామ్’ సినిమాని అక్టోబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా ‘సలార్’ సినిమాని రిలీజ్ చేస్తారట. అదే విధంగా వచ్చే ఏడాది సమ్మర్ కి ‘ఆదిపురుష్’ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభాస్ టీమ్.