Balayya: యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న అఖండ టీమ్​.. కేసీఆర్​పై బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

Balayya: అఖండ సినిమాతో టాలీవుడ్​లో సరికొత్త ఊపు రప్పించిన నందమూరి హీరో బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమా విజయవంతమైన శుభ సందర్భంలో బాలయ్య అండ్ హిస్ టీమ్​ రెండు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటోంది. తాజాగా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు అఖండ టీమ్. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వేదమంత్రాలతో ఆశీర్వదిస్తూ బాలయ్యకు తీర్థ ప్రసాదాలు సమర్పంచారు. మొదట్లో ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం […]

Written By: Raghava Rao Gara, Updated On : December 27, 2021 11:56 am
Follow us on

Balayya: అఖండ సినిమాతో టాలీవుడ్​లో సరికొత్త ఊపు రప్పించిన నందమూరి హీరో బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమా విజయవంతమైన శుభ సందర్భంలో బాలయ్య అండ్ హిస్ టీమ్​ రెండు రాష్ట్రాల్లోని పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటోంది. తాజాగా, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు అఖండ టీమ్. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు వేదమంత్రాలతో ఆశీర్వదిస్తూ బాలయ్యకు తీర్థ ప్రసాదాలు సమర్పంచారు. మొదట్లో ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలగ్గా.. బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.

దర్శన అనంతరం మీడియాతో ముచ్చటించిన ఆయన.. యాదాద్రి ఆలయ నిర్మాణంలో కేసీఆర్ చూపించిన ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయమని కొనియాడారు. భక్తులు కూడా ఆలయ విశిష్టతను, స్వచ్ఛతను పరిరక్షించాలని కోరారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ‘ అఖండ’ సినిమా విజయవంతమైన సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నాం. ఇప్పుడు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి వచ్చాం. నా ఇష్ట దైవం లక్ష్మీనరసింహస్వామి. ఈ ఆలయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆలయ నిర్మాణంపై కేసీఆర్ చూపిన చొరప ప్రశంసనీయం. ఇక దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని కోరుకుంటున్నా.  అని చెప్పుకొచ్చారు.

కాగా, అఖండలో అఘోరాగా బాలయ్య బాబు కనిపించిన సంగతి తెలిసిందే. ఇందులో ధర్మ సంరక్షకుడిగా కనిపించిన బాలయ్య నటనకు వేరే లెవెల్​లో రెస్పాన్స్ వచ్చింది. కాగా, ఇందులో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా కనిపించగా.. థమన్​ సంగీతం అందించారు.