నిర్మాతగా మారనున్న నాగచైతన్య

అక్కినేని నాగేశ్వర్ రావు మనువడు నాగచైతన్య త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నాని తదితర హీరోలంతా సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకొని సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ బ్యానర్లో వాళ్ల కుటుంబానికి చెందిన హీరోలతోపాటు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ నిర్మాతలుగా విజయవంతం అవుతున్నారు. వీరి బాటలోనే అక్కినేని నాగచైతన్య నడిచేందుకు సిద్ధమవుతున్నాడు. అక్కినేని కుటుంబానికి […]

Written By: Neelambaram, Updated On : February 26, 2020 3:30 pm
Follow us on

అక్కినేని నాగేశ్వర్ రావు మనువడు నాగచైతన్య త్వరలోనే నిర్మాణ రంగంలోకి అడుగులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నాని తదితర హీరోలంతా సొంత బ్యానర్లు ఏర్పాటు చేసుకొని సినిమాలు చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ బ్యానర్లో వాళ్ల కుటుంబానికి చెందిన హీరోలతోపాటు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ నిర్మాతలుగా విజయవంతం అవుతున్నారు. వీరి బాటలోనే అక్కినేని నాగచైతన్య నడిచేందుకు సిద్ధమవుతున్నాడు.

అక్కినేని కుటుంబానికి టాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా వీడదీయరాని బంధం ఉంది. టాలీవుడ్ హైదరాబాద్ రావడానికి ముఖ్య కారణం నాగేశ్వర్ రావు అని తెల్సిందే. అలాగే అక్కినేని నాగేశ్వర్ రావు అన్నపూర్ణ స్టూడియోను నిర్మించి ఎన్నో సినిమాలను చేశారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నాగార్జున నాగేశ్వర్ ఈ స్టూడియోను ప్రారంభించారు. సొంతంగా ‘మనం ఎంటర్ ప్రైజెస్’ బ్యానర్ ఏర్పాటుచేసి పలు సినిమాలకు నిర్మించారు. తాజాగా నాగార్జున తనయుడు నాగచైతన్య కూడా సొంత బ్యానర్ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాడు.

నాగచైతన్య ప్రస్తుతం ‘నాగేశ్వర్ రావు’ ‘లవ్ స్టోరీస్’ మూవీల్లో నటిస్తూ బీజీగా ఉన్నాడు. అయినప్పటికీ సొంత బ్యానర్ ఏర్పాటు చేసి కొత్త నటీనటులకు అవకాశం కల్పించాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. ఈ బ్యానర్లో చిన్న హీరోలతో తొలుత సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. అందులో భాగంగా రాజ్ తరుణ్ హీరోగా ఈ సినిమాను చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై నాగచైతన్య అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు సమాచారం.